కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలతో పంచాయతీలను చీకటి కమ్మేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బకాయి పిడుగు కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) బకాయిల వసూలులో నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నోటీసులు జారీ చేయడం.. అప్పటికీ స్పందించకపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తోంది. ఫలితంగా ఏ పంచాయతీ ఎప్పుడు అంధకారంలో మగ్గుతుందో.. ప్రభుత్వాధికారుల కార్యాలయాలను ఏ సమయంలో చీకటి ఆవహిస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
- సాక్షి ప్రతినిధి, కర్నూలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో పంచాయతీల విద్యుత్ బకాయి రూ.82 కోట్ల పైమాటే. ఆదుకోవాల్సిన ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులను బకాయిలకు జమ చేయాలనే ఆదేశాలతో సరిపెట్టింది. ఈ నిధులు అభివృద్ధి పనులకే సరిపోని పరిస్థితుల్లో బకాయిలకు ఎలా సర్దాలని సర్పంచ్లు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ బకాయిల చెల్లింపునకే ప్రాధాన్యతనిచ్చినా.. లక్షల రూపాయల బిల్లులకు ఆ నిధులు ఏ మూలకూ సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వాస్తవానికి పంచాయతీల కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని 2009లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఆదేశాలు వెలువడ్డాయి. పంచాయతీలపై విద్యుత్ భారం సరికాదని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కిరణ్కుమార్రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీల విద్యుత్ బకాయిల చెల్లింపు భారం నుంచి తప్పుకుంది. 2011 నవంబర్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆ మేరకు నిర్ణయించారు.
ఆ తర్వాత నుంచి బకాయిలతో పాటు ప్రతి నెలా విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆయా పంచాయతీలే చూసుకోవాల్సి వస్తోంది. ఈ కోవలో గత కొన్నేళ్లుగా పంచాయతీలను విద్యుత్ భారం వెన్నాడుతోంది. తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. 13వ ఆర్థిక సంఘం నుంచి వచ్చే అభివృద్ధి నిధులను బకాయిల చెల్లింపునకు ఉపయోగించాలని ఆదేశించడం గమనార్హం. అభివృద్ధి పనులకు వినియోగించాల్సిన నిధులను విధిలేని పరిస్థితుల్లో సర్పంచ్లు బకాయిలకు సర్దుబాటు చేస్తున్నా.. చాంతాడు బకాయిలతో చాలా పంచాయతీల్లో అంధకారం అలుముకుంటోంది.
ఇక తాగునీటికీ కటకటే..
పంచాయతీల విద్యుత్ బిల్లులను 2013 ఏప్రిల్లోనే ప్రభుత్వం పెంచింది. ఈ బిల్లుల కారణంగానే పంచాయతీల్లో సమస్య మొదలైంది. అభివృద్ధి పనులకే నిధులు లేక సతమతమవుతున్న పంచాయతీలకు ఇది మరింత భారమవుతోంది. బిల్లులు చెల్లించలేని పంచాయతీలకు విద్యుత్ శాఖ నిర్మొహమాటంగా సరఫరా నిలిపేస్తోంది. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో తాగునీటి సరఫరా పథకాల పైనా ప్రభావం చూపనుంది.
చీకటి కమ్మేస్తోంది
Published Sat, Nov 8 2014 2:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement