సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పార్టీని పున ర్నిర్మిస్తానని ప్రకటించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. కొత్త ప్రభుత్వంలో బెర్త్ దొరికినా అది మూడు నెలలే కాబట్టి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాల మీదే దృష్టి పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
ఈ మేరకు తన మద్దతుదారులతో ప్రాథమికంగా సమాలోచనలు చేశారని సమాచారం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో ఆనం సోదరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరు అటు పార్టీలోను, ఇటు ప్రభుత్వంలోను ఆధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆనం సోదరుల మీద పార్టీలో కొంత అసమ్మతి రాగం వినిపించినా మంత్రిగా తమకుండే అధికార బలంతో దాన్ని అధిగమిస్తూ వస్తున్నారు.
జిల్లా పార్టీ మీద తమ పట్టు పోకూడదనే ఉద్దేశంతోనే తమకు అత్యంత సన్నిహితుడైన చాట్ల నరసింహారావును ఇన్చార్జి డీసీసీ అధ్యక్షుడిని చేశారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆనం వివేకానందరెడ్డికి అతి దగ్గరి మిత్రుడిగా మెలిగిన నెల్లూరు సిటీ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి వంటి వ్యక్తి కూడా పార్టీకి గుడ్బై చెప్పబోతున్నారు. తొలి నుంచి ఆనం సోదరులతో అంటీముట్టనట్టే వ్యవహరిస్తూ వచ్చిన సర్వేపల్లి శాసనసభ్యుడు ఆదాల ప్రభాకరరెడ్డి సైతం మళ్లీ సైకిల్ ఎక్కబోతున్నారు.
సర్వేపల్లి, నెల్లూరు సిటీ, కోవూరు, ఉదయగిరి, కావలి, సూళ్లూరుపేట, గూడూరు శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కావాలని అడిగే వారే లేకుండా పోయారు. నెల్లూరు లోక్సభ స్థానానికి కూడా పోటీ చేసేందుకు ఎవరూ ధైర్యం చేసే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణం కావడంతో జిల్లాలో కేడర్ కూడా ప్రజల ముందుకు వెళ్లి ధైర్యంగా ఓటు అడిగే పరిస్థితి లేదు. ఇలాంటి వాతావరణంలోనే జిల్లాలో పార్టీని భుజానికెత్తుకుంటే భవిష్యత్తులో అధిష్టానం వద్ద భారీ పరపతి సంపాదించవచ్చనే దూరాలోచనతోనే ఆనం రామనారాయణరెడ్డి పార్టీ బాధ్యతలు మోయడానికి ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇందులో భాగంగానే తొలుత ఆయన డీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత జిల్లా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం ముంచుకురావడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఎవరో ఒకరిని పోటీ పెట్టేందుకు కసరత్తు చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రామనారాయణరెడ్డి కూడా ఆత్మకూరు నుంచి కాకుండా నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీచేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
డీసీసీ అధ్యక్షుడిగా ఆనం?
Published Sun, Feb 23 2014 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement