కొనసాగుతున్న వాయుగుండం | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వాయుగుండం

Published Fri, Nov 15 2013 4:21 AM

Deep depression to cross near Nagapattinam on Nov 16

సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం రాత్రి నాటికి కూడా వాయుగుండంగానే కేంద్రీకృతమై ఉంది. ఈనెల 16వ తేదీ రాత్రి నాటికి నాగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలి పారు.  రాష్ర్టంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లోనూ ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని  తెలిపారు. దక్షిణ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. 16, 17తేదీల్లో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement