ఫీజు రీయింబర్స్మెంట్కు శాపం
నాడు మహానేత ఉన్నతాశయం
ఆయన తర్వాత సర్వనాశనం
బాబు హయాంలో కానరాని సాయం
బకాయిలు, ఆంక్షలతో భ్రష్టుపట్టిన పథకం
సాక్షి,విశాఖపట్నం:‘‘ఉన్నత చదువులు చదుకోవాలని కల లు కన్న ఏ ఒక్క పేద విద్యార్థి డబ్బులు లేవనే కారణం తో చదువుకు దూరం కాకూడదు.ధనిక వర్గాలకే పరి మితమయ్యే ఉన్నత చదువులు పేద విద్యార్థికి అందాలన్నదే నా ధ్యేయం’ అంటూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో ఫీజురీయంబర్స్మెంట్ పథకాన్ని ఆవిష్కరించారు. పెద్ద చదువులు చదువుకోవాలన్న పేద విద్యార్థులకు తానే పెద్దదిక్కై నిలిచారు.
పథకానికి నిధుల కొరత లేకుండా చూసి లక్షలాదిమంది విద్యార్థుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించారు. ఆయనకు ముందు, ఆయన తర్వాత పాలించిన పెద్దలు మాత్రం యువత ఆకాంక్షలను పట్టించుకోలేదు సరికదా, వాటిని కాలరాసేట్టు వ్యవహరించారు. వైఎస్ ముందు చంద్రబాబు పాలనలో విద్యార్థులు కనీసం డిగ్రీ చదవడానికి కూడా దిక్కులేక అవస్థలు పడ్డారు. కిరణ్కుమార్ రెడ్డి హయాంలో ఫీజు పథకానికి గండి కొట్టడంతో విద్యార్థులు విలవిలలాడుతున్నారు.
ఉదారంగా వరం
పేద,మధ్యతరగతి వర్గాల విద్యార్థులు ఎంబీఏ,ఎంసీఏ, ఇంజినీరింగ్ చదువుకోవడం దాదాపు అసాధ్యమే. మహానేత వైఎస్ ఈ కలను నిజం చేశారు. రీయింబర్స్మెంట్ పథకానికి ఎప్పుడూ నిధుల కొరత రానివ్వలేదు. 2008-2009లో రూ. 91 కోట్లు, 2009-2010లో రూ. 97 కోట్లు ఠంచనుగా మంజూరు చేశారు. కిరణ్కుమార్రెడ్డి పాలనలో ఆంక్షలతో పథకాన్ని కాలరాసేందుకు యత్నించారు.
ఎంత వ్యత్యాసం!
వైఎస్ ఉండగా విద్యార్థులకు ఫీజులన్నీ ఒకేసారి చెల్లించేవారు. ఆయన మరణం తర్వాత నుంచి ఫీజుల వాపస్లో అంతు లేని జాప్యం కలుగుతోంది. వైఎస్ పాలనలో జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులు రెండు లక్షలకు పైగా ఉండేవారు. ప్రస్తుతం రకరకాల షరతుల కారణంగా దరఖాస్తుదారులు గతేడాది 82 వేలకు, ఈఏడాది 53 వేలకు తగ్గిపోయారు. వైఎస్ ఉన్నప్పుడు పథకానికి ఒక్క పైసా కూడా బకాయి ఉండేదికాదు. కానీ ఇప్పుడు పేరుకుపోయిన బకాయిలు రూ.70 కోట్లకు పైగానే ఉన్నాయి.
చదువు చాలా దూరం
చంద్రబాబు హయాంలో విద్యార్థుల సంక్షేమానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా లేదు. డిగ్రీ చదవాలన్నా ఆస్తులు ఆమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు కూడా కూలి పనులకు వెళ్లేవారు. ఇంజనీరింగ్ పీజులు కట్టలేక ఎందరో మెరిట్ విద్యార్థులు చదువుకు స్వస్తి చెప్పేవారు. గిరిజన విద్యార్థులు టెన్త్ తర్వాత పొలం పనులు చేసేవారు. ఈ కష్టాలను పాదయాత్రలో గమనించిన వైఎస్ విద్యార్థులకు మహోపకారం చేశారు.
యువకల చెదిరింది
Published Fri, Mar 21 2014 8:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement