మండలి చైర్మన్కు డిప్యూటీ సీఎం వినతి
విడిగా వినతిపత్రం సమర్పించిన టీ ఎమ్మెల్సీలు
సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపే తీర్మానం కోసం మంత్రి రామచంద్రయ్య 76వ నిబంధన కింద ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మండలి చైర్మన్ చక్రపాణిని కోరారు. సోమవారం సభ ప్రారంభానికి ముందే మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్బాబు, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేవలం అభిప్రాయాల కోసం మాత్రమే శాసనసభ, మండలికి పంపించారని పేర్కొన్నారు.
మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును బిజినెస్ రూల్స్ 80 ప్రకారం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున రామచంద్రయ్య అందజేసిన నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు విడిగా మరొక వినతిపత్రం చైర్మన్కు అందజేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి నేతృత్వంలో అందజేసిన వినతిపత్రంపై కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ సభ్యులు పలువురు సంతకాలు చేశారు. మరోవైపు సీఎం కిరణ్ సభాహక్కులు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ దిలీప్కుమార్ మండలి చైర్మన్కు నోటీసు అందజేశారు. సీఎంతో పాటు మంత్రి రామచంద్రయ్య, సీఎస్ పి.కె.మహంతిలకు వ్యతిరేకంగా మండలి నిబంధనావళి 173 ప్రకారం ఆయన నోటీసు ఇచ్చారు.
ఆ నోటీసును తిరస్కరించండి: దామోదర రాజనర్సింహ
Published Tue, Jan 28 2014 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement