కర్నూలు(కలెక్టరేట్): రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ప్రజాదర్బార్ వినతుల్లో అధిక శాతం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ బాధితుల గోడు విని పరిష్కారానికి సిఫారసు చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలే 30 శాతం వరకు మళ్లీ వస్తుండటమే అందుకు నిదర్శనం. ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే 11,352 వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో 8,716 వినతులను డిస్పోజల్ (పరిష్కారం) చేసినట్లు చూపుతున్నా.. 80 శాతం సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం గమనార్హం.
జిల్లా కలెక్టర్ తనకు వచ్చిన వినతులను పరిష్కారం నిమిత్తం ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారికి రెఫర్ చేస్తారు. ఆయన తన కింది స్థాయి అధికారికి పంపి డిస్పోజల్ చేసినట్లు చూపడం పరిపాటిగా మారింది. బాధితులు మాత్రం అదే వినతితో ప్రతి వారం ప్రజాదర్బార్ గడప తొక్కాల్సి వస్తోంది. ప్రజాదర్బార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33,507 వినతులు అందగా.. 30,007(90 శాతం) పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్కు నివేదించారు. పరిష్కారం ఈ స్థాయిలో ఉంటే ప్రజాదర్బార్కు బాధితులు పదేపదే ఎందుకు వస్తున్నారనేది వేయి డాలర్ల ప్రశ్న. జిల్లా పరిపాలనకు అధిపతి అయిన కలెక్టర్కు నేరుగా వినతులు అందిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రజాదర్బార్పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
ఆదోని, ప్యాపిలి, చాగలమర్రి, ఆత్మకూరు, సంజామల, ఆలూరు ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలంటే బాధితులకు కనీసం రూ.300 ఖర్చు అవుతుంది. ప్రతి వారం ఇలాంటి వారు వందల్లో ఉంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇస్తున్నా అధికారులు ఎండార్స్మెంట్తో సరిపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక సమస్యతో బాధితుడు మళ్లీ వస్తే అందుకు కారణాలను కలెక్టర్, జేసీలు పరిశీలిస్తే లోపం ఎక్కడుందనే విషయం బయటపడుతుంది. ఈ విషయంపై దృష్టి సారించనంత వరకు బాధితులు ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే.
మండలాల్లో కనిపించని గ్రీవెన్స్
ప్రతి సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటివరకు మండల పరిషత్ అధ్యక్షులు లేనందున స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాంది. మండలస్థాయి గ్రీవెన్స్కు విధిగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మండల స్థాయిలో గ్రీవెన్స్ తూతూమంత్రంగా సాగుతోంది. సగం మండలాల్లో ఆ ఊసే కరువైంది. సోమవారం దాదాపు 30 మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.
గుడ్డి దర్బార్
Published Tue, Jun 17 2014 1:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement