సాక్షి, అనంతపురం : ఢిల్లీ పరిణామాలపై సమైక్యవాదులు రగిలిపోతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు గురువారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలు, పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి.
పౌర సేవలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రూ.40 లక్షల మేరకు ఆదాయం కోల్పోయింది. తెలంగాణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి కార్యదర్శి బద్రీనాథ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఏపీ ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా బంద్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి, నాయకులు, కార్యకర్తలు బంద్ను పర్యవేక్షించారు. అనంతపురం నగరంలో వైఎస్సార్సీపీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
తొలుత సుభాష్ రోడ్డులోని మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి.. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలను చింపివేశారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. అనంతరం ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ విభజనపై కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు.
టీ బిల్లును లోక్సభలో పెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.మధుసూదన్రెడ్డి, సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విడపనకల్లులో రాస్తారోకో నిర్వహించారు.
తెలంగాణ బిల్లును కేంద్రం మొండిగా లోక్సభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ధర్మవరంలో సమైక్యవాదులు రోడ్డుపై మోకాళ్లతో నడిచి నిరసన వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గం సమన్వయకర్త బి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అనంతరం తెలంగాణ బిల్లు ప్రతులను కాల్చివేశారు.
మడకశిరలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
పెనుకొండలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త మంగమ్మ ఆధ్వర్యంలో బంద్ని ర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
పుట్టపర్తిలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్.హరికృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి సమైక్య పరుగును ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకోవడం సిగ్గుచేటన్నారు.
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నమన్వయకర్త వీ.ఆర్.రామిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
పోగాలమిది..
Published Fri, Feb 14 2014 3:24 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
తప్పక చదవండి
- ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
- మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
- అలాంటి సర్జరీ చేయించుకోమని సలహా ఇచ్చారు: టాలీవుడ్ హీరోయిన్
- రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్గా..!
- కేంద్ర కేబినెట్: ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు
- ఒకే రన్వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
- ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా..
- బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు
- దాయాదుల సమరానికి సర్వం సిద్దం.. అందరి కళ్లు పిచ్పైనే?
Advertisement