మర్రిపాడు (సరుబుజ్జిలి), న్యూస్లైన్ : మండలంలోని షళంత్రి పంచాయతీ మర్రిపాడులో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి 11 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. కొల్ల హాసిని, మజ్జి భరణి, కొమ్ము వివేకానంద, ఇప్పిలి కీర్తన, ఇప్పిలి ధనుష్, కొల్ల రుషేంద్ర, కందుల భార్గవి తదితరులు అతిసారతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అతిసార బాధితుల్లో 11 నెలల నుంచి ఐదేళ్ల బాలబాలికలు ఉన్నారు.
కలుషితమైన బోరు నీరే కారణం
గ్రామంలో బోరు నీరు కలుషితం కావడంతో తరచూ వ్యాధులు ప్రబలుతున్నాయని గ్రామానికి చెందిన కొల్ల శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో పాటు ఏఎన్ఎం హెడ్క్వార్టర్స్లో నివసించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర పరిస్థితిలో కూడా సాధారణమాత్రలు అందించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం మెరుగు చేయాలని, గ్రామంలో అతిసార బాధితులకు వైద్యసేవలందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
లావేటిపాలెంలో వైద్యశిబిరం ఏర్పాటు
లావేరు: మండలంలోని లావేటిపాలెం గ్రామంలో శనివారం లావేరు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. లావేటిపాలెం గ్రామానికి చెందిన భైరి జయప్రకాష్ డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు ప్రైవేట్ వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ‘లావేటిపాలెంలో బాలునికి డెంగీ’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురిమైంది. దీనికి స్పందించిన లావేరు పీహెచ్సీ వైద్యాధికారిణి భారతీకుమారి దేవి, రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ గ్రామంలో పర్యటించారు. లావేటిపాలెం గ్రామంలో శనివారం వైద్యశిబిరం ఏర్పాటు చేసి 67 మందికి డాక్టర్ భారతీకుమారి దేవి వైద్యసేవలందించారు. ఇంటింటా వెళ్లి జ్వర పీడితుల వివరాలను సేకరించారు. లావేటిపాలెంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై రణస్థలం క్లస్టర్ ఎస్పీహెచ్వో ఎంపీవీ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రణస్థలం క్లస్టర్ సీహెచ్వో రాజగోపాలరావు, హెల్త్ సూపర్వైజర్ రమణమూర్తి, హెచ్వీ హేమకుమారి, హెల్త్ సూపర్వైజర్ పీవీ రమణమూర్తి, ఏఎన్ఎంలు ఆర్.రమణమ్మ, జి.త్రివేణి, ఎస్.భవానీ, సరోజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిపాడులో ప్రబలిన డయేరియా
Published Sun, Aug 18 2013 4:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement