జహీరాబాద్, న్యూస్లైన్: మండలంలోని రంజోల్ గ్రామంలో అతిసార విజృంభిస్తోంది. తాజాగా శుక్రవా రం చంద్రమ్మ(55) అనే మహిళ అతిసార సోకి మరణించింది. దీంతో ఇప్పటివరకు ఈ అతిసార బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం లక్ష్మయ్య అనే వ్యక్తి మరణించగా, గురువారం ఉదయ్కిరణ్ అనే బాలుడు మరణించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు. చంద్రమ్మ అతిసారతో నీరసించడంతో గురువారం రాత్రి ఆమెను కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం తెల్లవారుజామున బీదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమె మృతదేహాన్ని రంజోల్ గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన 12 మంది అతిసార బారినపడి జహీరాబాద్లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అతిసారం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించడంతో శుక్రవారం కలెక్టర్ దినకర్బాబు గ్రామాన్ని సందర్శించారు. చంద్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులను సత్వరం నిర్వహించేందుకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కలెక్టర్ గ్రామ ప్రజలను కోరారు. అతిసార వ్యాధిని అదుపులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని అదేశించారు.
మంచినీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, ఎక్కడైనా పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయించాలని ఆదేశించారు. అనంతరం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం పొందుతున్న అతిసారగ్రస్థులను పరామర్శించారు. రోగుల పరిస్థితి గురించి వైద్యురాలు కిరణ్మయిని అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా మల్చల్మ పీహెచ్సీ సిబ్బందిని అస్పత్రికి అటాచ్ చేయాల్సిందిగా సూచించారు. గ్రామ ప్రజలు వ్యాధి తీవ్రత గురించి కలెక్టర్కు వివరించారు.
అధికారులతో సమీక్ష
రంజోల్ గ్రామంలో వ్యాపించిన అతిసారను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కలెక్టర్ దినకర్బాబు ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి, సంగారెడ్డి ఆర్డీఓ రాంచందర్రావు, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు శ్రీనివాసన్, డీఎల్పీఓ మనోహర్, అర్డబ్ల్యూఎస్, మల్చల్మ, మొగుడంపల్లి వైద్యాధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ విక్రంసిహారెడ్డిలతో సమావేశమయ్యారు. అతిసారను అదుపులో చేయడంతో పాటు మరింత విస్తరించకుండా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విజృంభిస్తున్న అతిసార
Published Sat, Aug 24 2013 1:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement