నిరాశపరిచిన బడ్జెట్
బడ్జెట్లో చంద్రబాబు హామీలకు దక్కని చోటు
తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు మాత్రమే నిధుల కేటాయింపు
వెంగళరాయసాగర్, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు మొండిచేయి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కొంతమోదం, అధికశాతం ఖేదం మిగిల్చింది. దీంతో జిల్లా వాసులను తీవ్ర నిరాశకు గురయ్యారు. గతంలో సీఎం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. అయితే వాటికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఆ హామీలను గాలికొదిలేసినట్టు బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం తోటపల్లి, తారకరామతీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి చంద్రబాబు సర్కార్ చేతులు దులుపుకొంది. కొత్త పరిశ్రమల ఏర్పాటు ప్రస్తావన కూడా రాలేదు. ఇంటికొక ఉద్యోగమని ఎన్నికలప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన చంద్రబాబు ఇప్పుడెలా ఉద్యోగాలు కల్పిస్తారో చెప్పలేదు. ఈ బడ్జెట్తో జిల్లాకు కొత్తగా ఒరిగిందేమీ లేదని జిల్లా వాసులు తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారు.
మూడు ప్రాజెక్టులకు అరకొర నిధులు... రెండింటికి మొండిచేయి
2015-16 బడ్జెట్లో తోటపల్లి, తారకరామతీర్థసాగర్, జంఝావతి ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించారు. తోటపల్లికి రూ.162 కోట్లు, తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టుకు రూ.44.80 కోట్లు, జంఝావతికి రూ.4.5 కోట్లు కేటాయించారు. గత ఏడాది నాటికి తోటపల్లి అంచనా వ్యయం రూ. 774కోట్లు కాగా అందులో రూ.600 కోట్లు వరకు ఖర్చు చేశారు. ఆ లెక్కల ప్రకారమైతే రూ.174కోట్లు అవసరం ఉంది, కానీ తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో మళ్లీ అంచనా వ్యయం మారినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల మేర నిధుల అవసరముంది. కానీ ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.161.98కోట్లు కేటాయించింది.
అవసరం మేర మంజూరు చేయనప్పటికీ పనుల ముందుకెళ్లడానికి ఈ నిధులు దోహద పడతాయి. ఇక తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులు చకచకా సాగాలంటే రూ.200కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.43కోట్లను మాత్రమే కేటాయించింది. ఇవి ఎంతమేరకు సరిపోతాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంటే ఇంతవేగంగా ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. ఇక, జంఝావతికి కేవలం రూ.4.5 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించలేదు. తోటపల్లి, తారకరామ తప్ప మిగతా ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకోలేదేమో అన్పిస్తోంది.
హామీల ప్రసావనే లేదు...
గత ఏడాది అసెంబ్లీలో జిల్లా అభివృద్ధి ప్రణాళిక పేరుతో ప్రకటించిన హామీలు అమలుకు నోచుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఎందుకంటే, వాటిలో ఒక్కదాన్ని కూడా బడ్జెట్లో పొందపరచలేదు. వాటి కోసం నిధులు కేటాయింపులు చేయలేదు సరికదా వాటిని ఏర్పాటు చేస్తామనే ప్రకటన కూడా చేయలేదు. లలిత కళల అకాడమీ ఏర్పాటు, స్మార్ట్ సీటీగా విజయనగరం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, పారిశ్రామిక నగరం, హార్డ్వేర్ పార్క్, నౌకాశ్రయం నిర్మాణం తదితర హామీల ఊసే బడ్జెట్లో కనిపించలేదు. ఏడాదిలోగా తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆమేరకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కళాశాల అనేవి కేంద్రం చూపే కరుణపై ఆధారపడి ఉంటాయి
జిల్లాలో ఇచ్చిన హామీలు గాలికి ....
చంద్రబాబు జిల్లాకొచ్చినప్పుడు ఇచ్చిన హామీలు కూడా గాలిలోనే కలిసిపోయాయి. బడ్జెట్లో వాటి ప్రస్తావనే తీసుకురాలేదు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్, చీపురుపల్లిలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు, గరివిడిలో పశు సంవర్థక శాఖ కళాశాల, పార్వతీపురంలో ఉద్యానవన కళాశాలను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు వాటికి సంబంధించి నిధులు కేటాయింపు జరగలేదు. ఈ విధంగా ఇచ్చిన హామీలేవీ ఆచరణకు నోచుకోవడం లేదు. అలాగని కొత్త వాటిని ప్రస్తావించలేదు. వెనకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
కొంత మోదం... అధిక ఖేదం
Published Fri, Mar 13 2015 2:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement