సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ | Sakshi
Sakshi News home page

సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ

Published Sat, Dec 14 2013 12:46 PM

సోమవారం నుంచే బిల్లుపై అసెంబ్లీలో చర్చ - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో సోమవారం నుంచే  ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బిల్లు ప్రతులను తెలుగులోకి అనువదించటం సమస్య కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. సోమవారమే బిల్లు ప్రతులను సభ్యులందరికీ ఇస్తామన్నారు. బిల్లును సభలో చర్చించి వీలైనంత త్వరగా రాష్ట్రపతికి పంపడమే తమ అజెండా అన్నారు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని గండ్ర సూచించారు.

Advertisement
Advertisement