ఎంసెట్ కౌన్సెలింగ్కు మోక్షం
- 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన
- జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాల ఏర్పాటు
గుంటూరు ఎడ్యుకేషన్ :ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ర్యాంకులు విడుదలై దాదాపు రెండు నెలలు గడిచిన తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కౌన్సెలింగ్పై స్పష్టత వచ్చింది. జిల్లాలోని నాలుగు హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మే 22న జరిగిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 19,250 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 47 ఇంజినీరింగ్ కళాశాలల్లో 20 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
చురుకుగా ఏర్పాట్లు..
కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలో సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి 23 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది.
ర్యాంకర్లు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు.. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఎంసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా కమ్ పాస్ సర్టిఫికెట్, 10వ తరగతి మార్కుల జాబితా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి ఒకటో తేదీ తరువాత జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకెళ్లాలి. అంగవైకల్యం, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విభాగాలకు చెందిన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ప్రాసెసింగ్ ఫీజు రూపంలో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 300 చెల్లించాలి.
ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన జరిగేదిలా
తేదీ ర్యాంకు (నుంచి.. వరకూ)
7న ఒకటి నుంచి 5,000
8న 5,001 నుంచి 10,000
9న 10,001 నుంచి 15,000
10న 15,001 నుంచి 20,000
11న 20,001 నుంచి 38,000
12న 38,001 నుంచి 56,000
13న 56,001 నుంచి 75,000
14న 75,001 నుంచి 90,000
16న 90,001 నుంచి 1,05,000
17న 1,05,001 నుంచి 1,20,000
18న 1,20,001 నుంచి 1,35,000
19న 1,35,001 నుంచి 1,50,000
20న 1,50,001 నుంచి 1,65,000
21న 1,65,001 నుంచి 1,80,000
22న 1,80,001 నుంచి 1,95,000
23న 1,95,001 నుంచి చివరి వరకూ
ఎట్టకేలకు.. సెట్టయ్యింది!
Published Tue, Aug 5 2014 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement