- రుణాలమాఫీ హామీలతో బీజేపీకి సంబంధం లేదు
- ఇక నుంచి ఒంటరిగానే పోటీ చేస్తాం
- జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసవర్మ సంచలన వ్యాఖ్యలు
ఆచంట : జిల్లా టీడీపీలో ఇచ్చి పుచ్చుకునే ధోరణి కనిపించడం లేదని, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీని ఆ పార్టీ పూర్తిగా విస్మరించిందని, ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీతో కలిసి పనిచేయలేమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తెగేసి చెప్పారు. ఆదివారం సాయంత్రం స్థానిక రామేశ్వరస్వామి వారి సత్రంలో స్థానిక నాయకుడు మడిచర్ల శ్రీహరి అధ్యక్షతన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది.
శ్రీనివాసవర్మ మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో జిల్లాలో మూడు ఎంపీపీ అధ్యక్ష పదవులు, మరికొన్ని వార్డులు కేటాయించాలని కోరినా టీడీపీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల నుంచి ఒంటిరిగానే పోటీ చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీకి ఇచ్చిన హామీలతో తమ పార్టీకి సంబంధం లేదన్నారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఆగస్టులో జిల్లాలో పర్యటించనున్నారని, ఆయనకు సమర్పించేందు కు జిల్లా అభివృద్ధికి సంబంధించి నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిపారు. కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు పీవీఎస్ వర్మ మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు పాకా సత్యనారాయణ ఆచంట మండల పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి రామచంద్రరావు, తమ్మినీడి సూర్యనారాయణ, ఎం.నాగసుబ్బారావు, పంచదార రమేష్ పాల్గొన్నారు.
టీడీపీతో కలిసి పనిచేయలేం
Published Mon, Jul 7 2014 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement