⇒ ఆయన ప్రసంగిస్తుండగా బయటకు వచ్చిన అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి
⇒ లోకేశ్ నామినేషన్ స్వీకరణతో వివాదం.. విమర్శలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ నరసింహన్ ప్రోటోకాల్కు తీవ్ర భంగం వాటిల్లింది. ఆయన సోమవారం ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణ బయటకు వెళ్లిపోవడం వివాదంగా మారింది. ఎమ్మెల్సీగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ నామినేషన్ను స్వీకరించేందుకు ఆయనలా వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్త మవుతున్నాయి. ఇది గవర్నర్ను అవమానించడమేనంటున్నారు. లోకేశ్ ఉదయం 10.39కి నామినేషన్ వేయడానికి రావాల్సి ఉన్నా ఆలస్యంగా వచ్చారు. నామినేషన్ ఫారాలపై సంతకాలు చేయించడం వంటి ప్రక్రియ పూర్తికావడానికి సమయం పట్టడంతో ముహూర్తం దాటిపోయిన తర్వాత ఇన్చార్జి కార్యదర్శి చాంబర్కు వచ్చారు.
అప్పటికే అక్కడ డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు, ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అందరూ కలసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఇన్చార్జి కార్యదర్శి రూములో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత నామినేషన్ ఫారాలను సత్యనారాయణకు అందజేసిన లోకేశ్ తదితరులు 11.09 నిమిషాలకు ముహూర్తం బాగుందని, అప్పుడు వచ్చి అధికారికంగా సమర్పిస్తామని చెప్పి బయటకు వచ్చేశారు. దీంతో సత్యనారాయణ సభ లోపలికి వెళ్లారు. 11.06 గంటలకు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే సత్యనారాయణ సభ నుంచి బయటకు వచ్చి తన చాంబర్కు వెళ్లారు. అప్పడు లోకేశ్ తదితరులు ఆయన చాంబర్కు వచ్చి అధికారికంగా నామినేషన్లు సమర్పించారు. లోకేశ్ ముఖ్యమంత్రి తనయుడు అయినంత మాత్రాన అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా సభ నుంచి బయటకు ఎలా వస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది గవర్నర్ ప్రోటోకాల్కు భంగం కలిగించడమేనని అంటున్నారు. మరోపక్క రిటర్నింగ్ అధికారి గదిలో లోకేశ్ పూజలు చేయడం కూడా వివాదంగా మారింది.
వివరణ కోరిన ఎన్నికల సంఘం: అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి కార్యాలయంలో లోకేశ్ పూజలు నిర్వహించడంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ అధికారులను ఆదేశించారు. కాగా తాను పూజ చేస్తున్నపుడు లోకేశ్ తదితరులు తన కార్యాలయం లోనికి వచ్చారని, తనతో కలసి పూజలో పాల్గొన్నారని సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కూడా వివరణ పంపినట్లు సమాచారం.
గవర్నర్ ప్రోటోకాల్కు భంగం!
Published Tue, Mar 7 2017 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement