అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదాని, నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే.. ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని, రేపు అధికారం చేతులు మారితే.. ఇప్పుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అధికారులు కూడా వ్యవస్థలోనే ఉంటారని, వ్యవస్థ గాడి తప్పితే దాన్ని మళ్లీ గాడిలో పెట్టడం సాధ్యమయ్యే పని కాదని బొత్స చెప్పారు. చట్టప్రకారం మీ కార్యక్రమాలు చేస్తే మాకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించకూడదని అన్నారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయకూడదని హితవు పలికారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
''తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఓట్లను కోట్లతో ఎలా కొనుగోలు చేస్తోందో, ఏపీలో కూడా అలాగే చేస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే, చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకోవాలో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారో అర్థమవుతుంది. వ్యవస్థ దారితప్పిదే దాన్ని సక్రమ మార్గంలో పెట్టడం చాలా కష్టం. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం సరికాదనే బలం లేనిచోట పోటీకి దూరంగా ఉంది. ఇప్పుడు వీళ్లు కొత్తగా ఓ డ్రామా తీసుకొచ్చారు. బంజారాహిల్స్లోని ఓ హోటల్లో వైఎస్ జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. నిజంగా సాక్ష్యాలుంటే ఏం జరిగిందో చెప్పాలి. అదేమీ లేకుండా ఎక్కడో ఏవో ఎవరో చెబితే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే, ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికే మీ మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారు. మళ్లీ అలాంటి మోసపు మాటలు చెప్పకండి.
ఇక సెక్షన్ 8 గుంచి చూస్తే.. రాష్ట్రవిభజన జరిగిన నేపథ్యంలో పార్లమెంటులో చట్టం అయినప్పుడు, అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టం తు.చ. తప్పకుండా అమలు కావాలనే మేం ముందునుంచి చెబుతున్నాం. అందులో సెక్షన్ 8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందే. రాష్ట్ర విభజన జరిగిన రోజు నుంచే ఇవన్నీ అమలులోకి వస్తాయి. అంతేతప్ప ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోడానికి ఇప్పుడు సెక్షన్-8 అమలు చేయాలనడం తప్పు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని నగరం. ఏడాది పాటు అన్నీ గాలికి వదిలేసి, ఇప్పుడు కేసు వచ్చింది కదాని ఈ సెక్షన్ గురించి మాట్లాడటం సరికాదు''.
'తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు'
Published Thu, Jun 25 2015 2:23 PM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement