పరిగి, న్యూస్లైన్: మండలంలో అతిసార వ్యాధిఅదుపులోకి రాకపోగా ఇతర గ్రామాల్లోకి కూడా విస్తరిస్తోంది. మండల పరిధిలోని 12 గ్రామాల నుంచి ఇప్పటి వరకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 230 కేసులు నమోదు కాగా మరో 200 వరకు కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యాయి. మంగళవారం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 15 కేసులు, చిగురాల్పల్లిలో 14 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 53 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిగురాల్పల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఒక్క గ్రామం నుంచే ఈ వారం వ్యవధిలో 100కు పైగా అతిసార కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 74 మంది చికిత్స నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన మరో 40 మంది పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా మంగళవారం ఈ గ్రామం నుంచి పరిగిలో నాలుగు, గ్రామంలోని వైద్య శిబిరంలో 14 అతిసార కేసులు నమోదయ్యాయి.
అధికారుల భిన్నవాదనలు..
పరిగి మండలంలో అతిసార ప్రబల డానికి గల కారణాల విషయంలో అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కో శాఖ అధికారులు ఒక్కో రకమైన కారణాలు పేర్కొంటున్నారు. నీరు కలుషితమవడంతోనే అతిసార ప్రబలిందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నీరు కలుషితం కాలేదని, పారిశుద్ధ్యలోపమే వ్యాధి ప్రబలడానికి కారణం కావచ్చని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జేసీకి వివరించారు. కాగా నాలుగు రోజులుగా గ్రామంలో ట్యాంకు ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులందరూ పరిగి నుంచి మినరల్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారు.
అవగాహనతోనే అతిసార కట్టడి:జేసీ
నిరంతర అవగాహనతోనే అతిసారలాంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించగలమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకట్రెడ్డి పేర్కొన్నారు. అతిసార వ్యాధితో వణికిపోతున్న చిగురాల్పల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలోని నీటి ట్యాంకును, మురుగు కాల్వలు, రోడ్లను ఆయన పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న వైద్యశిబిరానికి వెళ్లి రోగులను పరామర్శించారు. జేసీతో మాట్లాడిన గ్రామస్తులు అతిసార వ్యాధి ప్రబలడానికి ఈఓఆర్డీ వెంకటేశం, గ్రామకార్యదర్శి మొగులయ్యల నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదు చేశారు. ఆరు నెలలకొకసారి కూడా వాటర్ ట్యాంకు కడగటం లేదని, పైప్లైన్ల లీకేజీలను పట్టించుకోలేదని వారు జేసీకి వివరించారు. అనంతరం పరిగికి వచ్చిన ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. గ్రామంలో అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యలోపం, పెంటకుప్పలు, పేరుకుపోయిన మురుగు, పైప్లైన్ల లీకేజి తదితరాలు వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఆయనతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఎంఅండ్ హెచ్ఓ సుభాష్చంద్రబోస్, ఎస్పీహెచ్ఓ దశరథ్, తహసీల్దార్ బాల్రాజ్, ఎంపీడీఓ విజయప్ప, ఆర్డబ్ల్యూఎస్ డీఈ న ర్సింహులు, ఏఈ జైపాల్రెడ్డి తదితరులున్నారు.
అదుపులోకి రాని అతిసార
Published Wed, Aug 7 2013 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement