కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతుండటం వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇందుకు సరిపడా చికిత్సను అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గిరిజాశంకర్ వెల్లడించారు. శని వారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తిలో ఈనెల 2న గాం ధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని, ఈ వేడుకలకు హైదరాబాద్కు చెందిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు వచ్చారని తెలిపారు. అందులో ఒకరికి స్వైన్ఫ్లూ వ్యాధి లక్షణాలుండటంతో, వారి నుంచి ఆనంద్ అనే వ్యక్తికి సంక్రమించిం దన్నారు.
ఇదే విషయం తమ విచారణలో వెల్లడైందని చెప్పా రు. వ్యాధి లక్షణాలున్న విషయాన్ని ఆనంద్ వెంటనే సమాచారం ఇచ్చి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఆనంద్ తండ్రి రాంచంద్రయ్యకు స్వైన్ ఫ్లూ రావడంతో ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించి, ప్రత్యేక వార్డులు చికిత్స అందిస్తున్నామన్నారు. తూడుకుర్తిలో 14 వైద్య బృందాలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటిని నాలుగుసార్లు తనిఖీ చేసి గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామని, ఇంకెవ్వరికి వ్యాధి లక్షణాల్లేవని తేలిందన్నారు. స్వైన్ఫ్లూకు జిల్లాలోనే వైద్యం అందిస్తున్నామని, ఇందుకు ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి రాకుండా ఆపలేం కానీ, వచ్చిన వ్యాధిని ఇతరులకు సంక్రమించకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటి స్తే సరిపోతోందన్నారు. జిల్లా ఆస్పత్రిలో 20 బెడ్లతో కూడిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని, అవసరమైతే ఇంకో 20బెడ్లను అదనంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు. తూడుకుర్తితో పాటు, ఇతర గ్రామాల్లో ఈవ్యాధి సోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, వ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే దగ్గర్లో ఉన్నా పీహెచ్సీలను సంప్రదించి చికిత్స పొందుకోవాలని, ఏమైనా ఎక్కువైతే వెంటనే జిల్లా ఆస్పత్రికి రావాల్సిందిగా సూచించారు.
నాటు వైద్యాన్ని ప్రొత్సహించేది లేదు
జిల్లాలో చెంచుపెంట వాసులంతా నాటు వైద్యాన్ని సంప్రదించకుండా, ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో నాటు వైద్యాన్ని ప్రొత్సహించేది లేదన్నారు. చిన్న వైద్యానికి పెద్ద చికిత్సలు చేసిన ఆర్ఎంపీలకు ఇటీవల నోటీసులు జారీ చేశామని, వారి నుంచి సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి, ప్రాణం పోయ్యేలా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.రుక్మిణి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్యూల్ పాల్గొన్నారు.
స్వైన్ఫ్లూపై ఆందోళన వద్దు
Published Sun, Oct 20 2013 4:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement