కాకినాడ క్రైం :కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువతి మృతి చెందింది. అయితే దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు పంచాయతీ పరిధి తారకరామనగర్కు చెందిన కర్రి రేవతి దేవి (24) మీ-సేవ కేంద్రంలో పనిచేస్తోంది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమెను 12 రోజుల క్రితం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీయూ)లో ఉంచి చికిత్సనందించారు. శనివారం అర్ధరాత్రి ఆమె పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. డ్యూటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేకపోవడంతో జూనియర్ డాక్టర్లకు తెలిపారు. వారు పట్టించుకోలేదు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో ఆమె మృతి చెందింది.
కుటుంబ సభ్యుల ఆగ్రహం
తాము ఎంత మొత్తుకున్నా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి రేవతి దేవి ప్రాణాలు తీశారంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్ గేటు వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. అక్కడి నుంచి రోడ్డుపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. వన్టౌన్ ఎస్హెచ్ఓ అద్దంకి శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. విషయం సూపరింటెండెంట్ డాక్టర్ పి. వెంకటబుద్ధ దృష్టికి వెళ్లడంతో ఆయన సూచన మేరకు సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ స్వప్న కుమారి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేవతి దేవి కుటుంబ సభ్యులు సూపరింటెండెంట్, వన్టౌన్ పోలీసులకు వినతి పత్రాలు అందజేశారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రేవతి మృతి!
Published Mon, Oct 6 2014 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement