అనంతపురం: పట్టణంలో జరిగిన జంట హత్యలకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిదే బాధ్యత అని మృతుల బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేనే ఈ హత్యలు చేయించారని, గత ఆరు నెలలుగా హత్యలకు కుట్ర పన్నారని వారు వ్యాఖ్యానించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మృతుల బంధువులు నారాయణ నాయక్, కుమార్ నాయక్, భాస్కర్ నాయక్ డిమాండ్ చేశారు.
కాగా పరిటాల రవి వర్గానికి చెందిన గోపీనాయక్, వెంకటేష్ నాయక్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. కాగా హత్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు జంట హత్యల కేసులో ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ తెలిపారు. టీడీపీ ఎంపీటీసీ అకులప్ప సహా 9మందిపై కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.