టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర తికమక
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర సోమవారం శాసనసభలో తికమక పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించాలని ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు. సభలో నవ్వులు వినిపించడంతో.. సర్దుకొని.. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించవద్దని చెప్పారు. నదుల అనుసంధానంపై 344 నిబంధన కింద చేపట్టిన చర్చను సోమవారం ఆయన ప్రారంభించారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గిపోయిందని, దీనివల్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తుందన్నారు. మిగుల జలాల ఆధారంగా ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపడితే.. నికర జలాలు కావాలని రాయలసీమ నేతలు గొడవ చేసి ప్రాజెక్టులను అడ్డుకోడానికి ప్రయత్నించారని విమర్శించారు. మిగులు జలాల మీద హక్కు కోరబోమని కాంగ్రెస్ పాలకులు బ్రజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించారని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో బాబు ప్రభుత్వం చేసిన వాదన వల్లే అలా చేయాల్సి వచ్చిందని సభ్యులు వ్యాఖ్యానించినప్పుడు.. విననట్లుగా ముసిముసి నవ్వులు నవ్వారు. గోదావరిలో వృథాగా పోతున్న 3 వేల టీఎంసీల నీటి నుంచి కొంత భాగాన్ని కృష్ణాకు తరలించి, అక్కడ మిగిలే నీటిని రాయలసీమకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నిర్మాణాన్ని వ్యతిరేకించిన విషయాన్ని విపక్ష సభ్యులు గుర్తు చేయగా.. తాను నిపుణుల కమిటీ వేయాలని మాత్రమే డిమాండ్ చేశానని తప్పించుకున్నారు. పట్టిసీమ వల్ల గోదావరి జిల్లాలకు అన్యాయం జరుగుతుందంటూ.. రైతుల్లో భయాందోళనలు కలిగిస్తోందని విపక్ష ంపై మండిపడ్డారు. నదుల అనుసంధానానికి కలసి రావాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించండి..
Published Tue, Mar 17 2015 3:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కేకు స్టార్ ప్లేయర్స్ దూరం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
Advertisement