రూ.282 కోట్లకు సోమా కంపెనీకి
ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని షరతు
ప్రారంభమైన ఇళ్ల తొలగింపు పనులు
ఫ్లైవోవర్ పొడవు 2.5 కిలోమీటర్లు
5.2 కిలోమీటర్ల రోడ్డు
నాలుగు లైన్లుగా విస్తరణ
విజయవాడ : విజయవాడలో ఎట్టకేలకు కనకదుర్గ ఫ్లైవోవర్ పనులు ప్రారంభమయ్యాయి. గురువారం ఫ్లైఓవర్ టెండర్లను ఆర్అండ్బీ నేషనల్ హైవేస్ విభాగం అధికారులు రూ.282 కోట్లకు సోమా కన్స్ట్రక్షన్ కంపెనీకి ఖరారు చేశారు. ఏడాది కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేలా షరతు విధించారు. ఈ క్రమంలో గురువారం నుంచి ఫ్లైఓవర్, రహదారి విస్తరణకు వీలుగా రోడ్లపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మొదలైనట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. మరోపక్క అధికారిక లాంఛనాలన్నీ పూర్తిచేసుకొని సోమా సంస్థ మరో 15 రోజుల్లో నిర్మాణ పనులు మొదలుపెట్టేలా కసరత్తు సాగిస్తోంది.
తొలగింపు పనులు మూడు రోజుల్లో పూర్తి...
భవానీపురం లారీ స్టాండ్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు వరకు 2.5 కిలోమీటర్ల పొడవున ఆరులైన్లలో ఫ్లైఓవర్ నిర్మాణం, భవానీపురం లారీ స్టాండ్ నుంచి కనకదుర్గ వారధి వరకు 5.2 కిలోమీటర్ల పొడవున ఉన్న రహదారిని నాలుగులైన్లుగా విస్తరణ పనులు ఈ ప్రాజెక్ట్లో భాగంగా జరగనున్నాయి. ఇళ్ల తొలగింపు, అండర్ గ్రౌండ్లో ఉన్న వాటర్ పైప్లైన్ల మార్పు, రోడ్లపై ఉన్న విగ్రహాల తొలగింపు తదితర కార్యక్రమాలు గురువారం మొదలుపెట్టారు. తొలగింపు కార్యక్రమాలన్నీ మరో మూడు రోజుల్లోగా పూర్తి చేయటానికి రెవెన్యూ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగర కమిషనర్ వీరపాండియన్ విద్యాధరపురంలో ఉన్న హెడ్వాటర్ వర్క్స్ను పరిశీలించారు. మార్కింగ్ అయిన మేరకు వాటర్వర్క్స్ ప్రహరీగోడను తొలగించారు. రహదారి విస్తరణలో 65 నివాస గృహాలు పోతాయని అధికారులు నిర్ధారించి వారికి జక్కంపూడిలోని ప్లాట్లు కేటాయించనున్నారు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రథం సెంటర్ వరకు ఉన్న 5 ఎంజీడీ, 16 ఎంజీడీ వాటర్ పైప్లైన్, కుమ్మరిపాలెం సెంటర్ నుంచి నాలుగు స్తంభాల సెంటర్ వరకు ఉన్న 8 ఎంజీడీ, 11 ఎంజీడీ వాటర్ పైప్లైన్లను కూడా విస్తరణ పనుల కోసం తొలగించనున్నారు. విస్తరణలో అశోక స్థూపం, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు, ఇతర జాతీయ నేతల విగ్రహాలు తొలగించి వాటిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని వేరే ప్రాంతంలో ప్రతిష్టించేలా నగరపాలక సంస్థ అధికారులు అన్ని చర్యలు తీసుకోనున్నారు.
టెండర్ దక్కింది ఇలా...
విజయవాడ ఆర్అండ్బీ నేషనల్ హైవే విభాగం అధికారులు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వానికి పంపారు. దీనిలో భాగంగా రూ.338 కోట్ల నిర్మాణ వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును పరిశీలించి టెండర్ విలువను రూ.464 కోట్లుగా నిర్ణయించింది. దీంతో ప్రాజెక్ట్ను కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఆర్అండ్బీ నేషనల్ హైవే విభాగం అధికారులు చేపట్టనున్నారు. టెండర్ దక్కించుకోవటానికి అనేక కంపెనీలు పోటీలో నిలిచాయి. ఈ క్రమంలో ఎల్అండ్టీ సంస్థ రూ.362 కోట్లు, నవయుగ కంపెనీ రూ.352 కోట్లు, సోమా కంపెనీ రూ.282 కోట్లకు టెండర్లు దాఖలు చేశాయి. తక్కువకు కోట్ చేసిన సోమా కంపెనీకి టెండర్ కేటాయించారు. ఈ క్రమంలో తొలగింపు కార్యక్రమంతో ట్రాఫిక్కు అవాంతరం కలగకుండా కమిషనరేట్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు మొదలుపెట్టారు. ఈ నెల ఏడోతేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు అమలులోకి రానుంది. టెండరు ఖరారు నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
దుర్గగుడి ఫ్లైఓవర్ టెండర్ ఖరారు
Published Fri, Nov 6 2015 1:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement