విజయనగరం కంటోన్మెంట్: జన్ధన్ యోజన పథకం కింద ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లు ఉండాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ స్పష్టం చేశారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్లు, కార్యదర్శుల ద్వారా గ్రామాల్లో ఖాతాలు లేని కుటుంబాలను గుర్తించి బ్యాంకు అకౌంట్లు తక్షణమే తెరిపించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి మంగళవారం ఆయన తహశీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సహకరించని బ్యాంకర్ల వివరాలు తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. మొదటి దశ రుణమాఫీ కార్యక్రమం కింద లబ్ధిపొందని రైతుల ఫిర్యాదులను పరిష్కరించి అప్లోడ్ చేయాలన్నారు. వేరే మండలానికి చెందిన ఫిర్యాదులను ఆయా మండలాలకు పంపించి పరిష్కరించాలని సూచించారు. రెండో దశకు అర్హులైన వారి వివరాలను త్వరితంగా అప్లోడ్ చేయాలన్నారు.
రైతులకు అందజేస్తున్న ఈ పాస్ పుస్తకాలు వెయ్యి వరకూ పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన అందజేయాలన్నారు.వయోజన విద్యా కేంద్రాల్లో చదువుతున్న వారికి మార్చి 15వ తేదీన పరీక్ష జరగనుందని, ఈ పరీక్షకు అందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు, ఇన్విజిలేటర్ల నియామకం, వసతుల ఏర్పాటు వంటి ప్రక్రియలు చేపట్టామని తెలిపారు. గతసారి హాజరు కానివారు, హాజరై పరీక్షలో ఫెయిల్ అయిన వారు మాత్రమే ఈ పరీక్షకు హాజరు కావాలని స్పష్టం చేశారు. సాక్షరభారత్ 5వ ఫేజ్ కింద జనవరి1వ తేదీనుంచి తరగతులు ప్రారంభమయ్యాయని, వారికి 6 నెలల తరువాత పరీక్ష నిర్వహిస్తారన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ జి.రాజకుమారి, ఆర్డీఓ జె. వెంకటరావు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ గాయత్రీ దేవి, డ్వామా ఏపీడీ అప్పలనాయుడు, వయోజన విద్యా ఉప సంచాలకులు ఎం.అమ్మాజీరావు, మండలాల నుంచి తహశీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు పాల్గొన్నారు.
ప్రతి కుటుంబానికీ రెండు బ్యాంకు అకౌంట్లుండాలి
Published Wed, Feb 4 2015 2:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement