విజయవాడను విస్మరిస్తే జనం క్షమించరు
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ
విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత విజయవాడను రాజధానిగా ప్రకటించి న సీఎం చంద్రబాబు ఇప్పుడు గుంటూరు పాట పాడటం వెనుక కోటరీ ప్రభావం ఉందన్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడానికి రైతాంగం సిద్ధంగా ఉందన్నారు. నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో వేలాది ఎకరాల దేవాలయ భూములు ఉన్నాయన్నారు. తుళ్లూరు, వెంకటాయపాలెం ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకం కాదన్నారు. కృష్ణాజిల్లాను కలుపుకొని రాజధాని ఏర్పాటు చేయాలన్నదే తన డిమాండ్గా పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టిన జిల్లాను విస్మరిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించరన్నారు. గతంలోనే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాను కాబట్టి.. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం లేదనుకునే ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తే తెలుగుజాతి క్షమించదన్నారు.
రాజధాని నిర్మాణానికి సుజనా చౌదరి, జీఎంఆర్ అల్లుడి వంటి కార్పొరేట్ శక్తులతో కాకుండా సాంకేతిక నిపుణులతో కమిటీ వేస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కృష్ణాజిల్లాలో వేలాది ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని నెహ్రూ చెప్పారు. కోట్లు గుమ్మరించి గుంటూరు జిల్లాలో భూములు కొనాలనుకోవడం వెనుక బాబు కోటరీ చక్రం తిప్పుతోందన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో త్వరలోనే బయటపెడతానన్నారు. ఇంత జరుగుతున్నా కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరు మెదకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చెప్పే ప్రతి మాటకు తలలు ఊపడం మాని విజ్ఞతతో ఆలోచించాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు దమ్ముంటే న్యాయవిచారణ జరిపించాలన్నారు. తప్పు చేసినట్లు రుజువైతే జైలుకెళ్లడానికి తమ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబులా బెయిల్ తెచ్చుకోబోమని దేవినేని నెహ్రూ ఎద్దేవా చేశారు.
రాజధాని చెరి సగం కావాలి
Published Tue, Nov 11 2014 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement