సర్కారుతో చర్చించి నిర్ణయిస్తామన్న టీ-విద్యా మండలి
కౌన్సెలింగ్ నిర్వహణ మాదేనన్న ఏపీ మండలి
సాక్షి, హైదరాబాద్: 174 కాలేజీలకు సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కోసం శనివారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే షెడ్యూల్పై ప్రభుత్వంతో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. కాగా, సంబంధిత అథారిటీనే కౌన్సెలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు తాజాగా సవరణ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కౌన్సెలింగ్ను గతంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రాతినిధ్యంతో నియమించిన ప్రవేశాల కమిటీ నేతృత్వంలోనే చేపట్టే అవకాశముంది.
అదే కమిటీకి ప్రవేశాలను చే పట్టే బాధ్యతను అప్పగించామని ఏపీ ఉన్నత విద్యా మండలి పేర్కొంటుండగా, సుప్రీం ఆదేశాల ప్రకారం ‘సంబంధిత అథారిటీ’ అన్నందున తామే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పేర్కొంటోంది. శనివారం ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాల షెడ్యూలును జారీ చేస్తామని టీ-విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. 14వ తేదీ నాటికి ప్రవేశాలు చేపట్టి, 15 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతామన్నారు. మరోవైపు సుప్రీం తాజా సవరణ ఉత్తర్వుల్లో సంబంధిత అథారిటీ అని పేర్కొనడమేకాకుండా గతంలో ప్రవేశపరీక్ష నిర్వహించిన స్టేట్ అని కూడా పేర్కొందని, విభజన చట్టంలోనూ ప్రవేశాల నిర్వహణ బాధ్యత తమకే అప్పగించినట్లు ఉందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. అయితే గతంలో మాదిరిగానే ఎంసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్, కోకన్వీనర్లకే బాధ్యత అప్పగించామని చెప్పారు.
పాత విధానంలోనే కౌన్సెలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతించిన సుప్రీంకోర్టు... బుధవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కానీ బుధవారం కోర్టు ఉత్తర్వుల కాపీలో కౌన్సెలింగ్కు కళాశాలలే దరఖాస్తులను ఆహ్వానించాలని ప్రచురితమైంది. దీనిని సవరిస్తూ సంబంధిత ఆధీకృత సంస్థ (ఉన్నత విద్యా మండలి) కౌన్సెలింగ్ను నిర్వహించాలని పేర్కొంది.
174 కాలేజీల్లో అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్!
Published Sat, Nov 1 2014 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement