సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఎంసెట్ను తమ రాష్ట్రానికి వేరుగా నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్ను ప్రకటించింది. ఎంసెట్ సహా వివిధ సెట్లను ఉమ్మడిగా నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంతకుముందే షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 10న ఎంసెట్ నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు కూడా చేపట్టింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఎంసెట్ను విడిగా నిర్వహించుకునేందుకు వీలుగా షెడ్యూల్ను విడుదల చేయించింది.
మే 14న తెలంగాణ ఎంసెట్ జరుగుతుందని, హైదరాబాద్ సహా తెలంగాణ కాలేజీల్లో చేరదల్చుకున్న ఏపీ విద్యార్థులు తమ ఎంసెట్ను కూడా రాయాలని స్పష్టం చేసింది. తెలంగాణ షెడ్యూల్ ప్రకటనను తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ నరసింహ న్కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ షెడ్యూల్ విడుదలైన వెంటనే ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంటా, వేణుగోపాలరెడ్డిలు రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని, ఒంటెత్తు పోకడలతో వెళ్తోందని ఫిర్యాదు చేశారు. విభజన చట్టం మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల బాధ్యత ఏపీ ఉన్నత విద్యా మండలిదేనని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ఉన్నత విద్యామండలికి పంపిన లేఖను మంత్రి గంటా గవర్నర్కు చూపించారు. ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను నిలిపేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి రాసిన లేఖకు స్పందనగా ఆంధ్రాబ్యాంకు న్యాయసలహాలు తీసుకొని ఈ లేఖను పంపించిందన్నారు. దీని ప్రకారం చూసినా ఉమ్మడి పరీక్షలపై ఏపీ ఉన్నత విద్యామండలికే సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఎంసెట్ను తామే నిర్వహిస్తామని అన్నారు.
వేర్వేరుగా సెట్లు నిర్వహిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులూ రెండేసి ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుందని తెలిపారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇరువురు సమన్వయంతో ఏకాభిప్రాయానికి వచ్చి పరీక్షల నిర్వహణను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పినట్లు సమాచారం.
గవర్నర్ సూచనల్ని అంగీకరించాలి: గంటా
ఉమ్మడి ఎంసెట్పై గవర్నర్ నరసింహన్ గతంలో మూడు ప్రతిపాదనలు చేశారని, వాటిలో తెలంగాణ ప్రభుత్వం దేనికి అంగీకరించినా ఆ ప్రకారం నడుచుకోవడానికి తాము సిద్ధమేనని ఏపీ మంత్రి గంటా తెలిపారు. గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతినిధి చైర్మన్గా, ఏపీ ప్రతినిధి వైస్ చైర్మన్గా ఉమ్మడి ఎంసెట్కైనా తమకు అభ్యంతరం లేదన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ తీరుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. తమ ఖాతాలను స్తంభింపచేయాలని తెలంగాణ మండలి బ్యాంకులకు లేఖలు రాయడం దారుణమన్నారు.టి.ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు విడిగా షెడ్యూల్ను ప్రకటించడంతో దానిపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఎంసెట్పై రగడ
Published Tue, Jan 20 2015 12:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement