కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన పాఠశాలల్లో అనధికారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి పలాయనం చిత్తగించడం పట్ల తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో మరిన్ని ఉన్నాయనేది అక్షరసత్యమైనా.. విద్యాశాఖ నిర్లక్ష్యం వీడని పరిస్థితి. ప్లేస్కూళ్లకు వేలల్లో వసూలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లూ ఫీజుల దందాకు దిగినా ఆడిగేవారే కరువయ్యారు.
కేశవరెడ్డి పాఠశాలల్లో రెండు నుంచి మూడు లక్షల వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ చేయించుకుంటారు. వాటికి ప్రామిసరి నోట్ రాసిచ్చి విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. వెళ్లిపోయేటప్పుడు వారు కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దీంతో కేశవరెడ్డి పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ చేశారు. ఈ తరహాలో ఫీజులు అనధికారంగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ చేష్టలుడిగి చూస్తోంది.
జిల్లాలోని మరిన్ని పాఠశాలల్లో వసూళ్లు
డిపాజిట్ల సంస్కృతి ఒక్క కేశవరెడ్డి పాఠశాలల్లోనే కాదు.. మరికొన్ని పాఠశాలల్లోనూ కనిపిస్తోంది. పలు కార్పొరేట్ పాఠశాలల్లోనూ డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. నంద్యాలలో ఓ విద్యానికేతన్ పాఠశాలలో లక్ష రూపాయలు డిపాజిట్ చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని నంద్యాల చెక్పోస్టు, నందికొట్కూరు రోడ్డులోని పాఠశాలల్లో అనధికారంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం. ఎమ్మిగనూరులోని ఓ కార్పొరేట్ పాఠశాలల, ఆదోనిలో మిల్టన్ గ్రూప్ స్కూల్స్, రాంజల రోడ్డులోని ఓ పాఠశాలల్లో అనధికారిక వసూళ్ల దందా కొనసాగుతోంది.
చట్టవిరుద్ధం
చదువుకోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు అనధికారంగా వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ విషయం పాఠశాలల యాజమాన్యాలు, విద్యాశాఖాధికారులకు తెలియనిది కాదు. అయినా పట్టించుకోకపోవ డం దారుణం. మరోవైపు విద్యా సంస్థలు నడిపే యాజ మాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేసి వ్యాపారాలకు తెరతీస్తుండటం సుస్పష్టం.
నమ్మకంపైనే డిపాజిట్ చేస్తారు
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై ఉన్న నమ్మకంతోనే డిపాజిట్లు కట్టారు. అయితే వాళ్లు నమ్మకాన్ని వమ్ముచేశారు. ఇది 100 శాతం చట్టవిరుద్ధం. తల్లిదండ్రులు సహనం పాటించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా వచ్చే విద్యను సంరక్షించుకోవాలి.
- చెన్నయ్య, టౌన్ మోడల్ జూనియర్ కళాశాల, కర్నూలు
తల్లిదండ్రులు కట్టించిన ఫీజులను వెనక్కివ్వాలి
కేశవరెడ్డి పాఠశాలల్లో జరిగిన ఫీజు దోపిడీకి విద్యాశాఖ బాధ్యత వహించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కట్టిన డిపాజిట్లను ప్రభుత్వమే చెల్లించి న్యాయం చేయాలి. విద్యాశాఖ కళ్లు మూసుకుని పనిచేస్తోంది. ఇలాంటి దందాలు జిల్లాలో మరిన్ని స్కూళ్లలో ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.
-లక్ష్మీనరసింహ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లాలో ఎక్కడైనా కేశవరెడ్డి స్కూళ్ల తరహాలో డిపాజిట్లు కట్టించుకొని తిరిగివ్వకపోతే ఫిర్యాదు చేయండి. చట్టవిరుద్ధంగా ఫీజులు వసూలు చేసే స్కూళ్లపై చర్యలు తీసుకుంటాం. ఆదోని మిల్టన్ గ్రూప్ ఆఫ్ స్కూళ్లపై విచారణ చేస్తా. కేశవరెడ్డిని అరెస్టు చేసినా స్కూళ్లు యథావిధిగా కొనసాగుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
- డీవీ సుప్రకాష్, డీఈఓ
విద్యా వ్యాపారం
Published Fri, Sep 11 2015 4:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement