తిరుపతి : రాష్ర్టంలో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోందని చంద్ర గిరి ఎమ్మెల్యే చెవి రెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. మంగళ వారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అయన విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీని గతంలో 1999 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలాగే అటకెక్కించేస్తారా అని ఆయ న ప్రశ్నించారు. 1999 ఎన్నికల్లో బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ప్రకటించి టీడీపీ మాట తప్పిన సంగతిని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గుర్తు చే శారు.
ఒక వేళ ఇచ్చిన హామీని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటే రాష్ట్రంలోని మొత్తం విద్యార్థినుల సంఖ్య, వారికి ఒక విద్యాసంవత్సరానికి అయ్యే ఖర్చు, అందుకు బడ్జెట్ కేటాయింపుల వివరాలు ఇవ్వాలని చెవిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీఈ చట్టం కింద ప్రతి విద్యార్థికి ఉచితంగా విద్య అందివ్వాల ని కేంద్రప్రభుత్వం సూచించిందని అసలు రాష్ట్రంలో ఈ చట్టం అమలు అవుతోందా లేదా సూటిగా సమాధానం చెప్పాలని భాస్కర్రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలకు ఆర్టీఈ వర్తిస్తుందా లేదా చెప్పాలన్నారు. నామినేటెడ్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాష్ర్టం లో ఎడ్యుకే షన్ మాఫియా నడుస్తోందని ఆయన ఆరోపించారు.
సౌకర్యాలన్నీ లేకపోయినా పల్లెలు, పట్టణాల్లో కాలేజీలు నెలకొల్పి బ్రాండ్ ఇమేజ్ను అడ్డంగా పెట్టుకుని తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వారిని అప్పులపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎడ్యుకేషన్ మాఫియాలాగా విద్యాసంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందో తమకు అర్థం కావడం లేదన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఐప్యాడ్లు ఇస్తారా? ఎంపీ ల్యాడ్స్ నిధులతో బాలికల హాస్టళ్లకు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పాటించే చర్యలేవైనా తీసుకుంటున్నారా? అంటూ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. ఎన్నికల హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారని భాస్కర్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తోంది
Published Wed, Sep 3 2014 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement