గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లో విద్యకు దూరమైన పేద కుటుంబాల విద్యార్థినులను చేరదీసి వారికి ఉచిత వసతితో కూడిన విద్యను అందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. జిల్లాలో 24 కేజీబీవీలు ఉండగా అన్నింట్లోనూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే పనిచేస్తున్నారు. ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీల్లో విద్యార్థినులకు భద్రత కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా అక్షరాస్యతను పెంపొందించేందుకు ఉద్దేశించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఒకనాడు దేశంలో విలువలతో కూడిన విద్యాలయాలుగా విరాజిల్లాయి. ఎంతో ఘన చరిత్ర కలిగిన కేజీబీవీలు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ప్రాభవం కోల్పోతున్నాయి. పేద కుటుంబాల్లోని విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించి సమాజంలో విద్యావంతులుగా నిలపాల్సిన కేజీబీవీలు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నడుస్తున్నాయి.
కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులే దిక్కు
జిల్లాలో 24 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో సర్వశిక్షా అభియాన్ యాజమాన్యంలో ఆరు, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహణలో ఆరు, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఎనిమిది, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో మరో నాలుగు ఉన్నాయి. వీటిలో 4,904 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో కేజీబీవీలో 200 మంది విద్యార్థినులున్నారు. పులిచింతల నిర్వాసితుల గ్రామాల్లో నుంచి 104 మంది విద్యార్థినులను సమీప మండలాల్లోని కేజీబీవీల్లో చేర్పించారు. ఒక్కో కేజీబీవీల్లో ప్రత్యేకాధికారితో పాటు ఆరుగురు కాంట్రాక్ట్ రెసిడెన్స్ టీచర్లు పనిచేస్తున్నారు.
వీరితో పాటు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై మగ్గురు వంటపని వారు, ఇద్దరు వాచ్మెన్లు, అటెండర్, ఒక ఏఎన్ఎం పని చేస్తున్నారు. మధ్యలో బడి మానేసిన, అనాథలు, తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన విద్యార్థినులకు కేజీబీవీల్లో ఉచిత విద్య అందించాలని నిబంధనలు స్పష్టం చేస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులను అర్ధాంతరంగా పాఠశాల మాన్పించి వేసి కేజీబీవీల్లో చేర్పిస్తున్నారు. దీంతో అసలు లక్ష్యం కాస్తా నీరుకారుతోంది. విద్యార్థినుల భద్రతకు సంబంధించి పటిష్టమైన విధానం లేకపోవడంతో కేజీబీవీల్లోకి రాత్రి వేళ ఆగంతుకులు ప్రవేశించిన సంఘటనలు ఉన్నాయి.
కేజీబీవీలకు ప్రహరీ, పగలు, రాత్రి కాపలాదారులు ఉన్నప్పటికీ ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కరువై కాలం నెట్టుకొస్తున్నారు. రోజులో 24 గంటలు కేజీబీవీల్లో ఉంటున్న విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, వ్యక్తిగత సమస్యలతో మహిళా ఉపాధ్యాయినులు విధి నిర్వహణలో అభద్రతా భావానికి గురవుతున్నారు.
ఊళ్లకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో...
ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న కేజీబీవీలకు చేరుకునేందుకు సరైన రవాణా సదుపాయాలు లేక ఉపాధ్యాయినులు, విద్యార్థులను చూసేం దుకు వెళ్లే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆగంతుకులు చొరబడితే రక్షణ కల్పించే వ్యవస్థ లేకపోవడంతోపాటు, పిలిస్తే పలికే నాథుడు సైతం కరువయ్యారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయినులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో నెట్టుకొస్తున్న కేజీబీవీల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు శాశ్వత రీతిలో నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.
‘అక్షరాలా’ నిర్లక్ష్యం
Published Mon, Sep 21 2015 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement