విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లా లో ఎన్నికల సందడి మొదలైంది. ఇక్కడ ఉన్న ఈవీఎంలను కేరళకు పంపి, వాటిస్థానంలో అధునాతన ఐదు వేల ఈవీఎంలను జిల్లా కేంద్రానికి ఎన్నికల కమిషన్ పంపించింది. వీటి ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత రశీదు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఓటు నమోదు అయినట్లుగా పరిగణిస్తారు. అయితే ఇవి సరిగా పనిచేస్తున్నాయో లేవో నిపుణలతో పరిశీలించిన జరిపిన తరువాత మండలాల కు పం పించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి బి.హేమసుందరవెంకటరావు తెలిపారు. వీటి వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని చెప్పారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు..
కలెక్టరేట్లో ఈవీఎంలు భద్రపరిచారు. వీటిని ఏ ఒక్కరూ అనధికారకంగా ముట్టుకోడానికి కూడా అవకాశం లేకుండా సీళ్లు వేశారు. అంతేకాకుండా ప్రత్యేకంగా నాలు గు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. లారీల ద్వారా ఉదయాన్నే ఈవీఎంలు కలెక్టరేట్కు చేరుకున్నప్పటికీ వాటిని అన్లోడ్ చేయటానికి కళాసీలకు సంబంధిత రేటు కుదరక పోవడంతో కొంతసేపు వాటిని దించలేదు. ఎట్టకేలకు డీఆర్వో రంగ ప్రవేశం చేసి రాజీ కుదిర్చారు.