రామకుప్పంలో ఏనుగుల బీభత్సం | Sakshi
Sakshi News home page

రామకుప్పంలో ఏనుగుల బీభత్సం

Published Sat, Dec 5 2015 8:47 AM

elephants attack on fields in chittoor district

చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని పంద్యాలమడుగు, పల్లెకుప్పం, తుంగరాపురంలో శనివారం పొలాలపై దాడికి దిగాయి. ఏనుగుల దాడిలో బీన్స్, వరి, రాగి పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఏనుగులు గుంపు ఒక్కసారిగా దాడికి దిగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైయ్యారు. ఏనుగుల దాడి ఘటనపై అధికారులకు సమాచారం అందించారు.

Advertisement
Advertisement