హైదరాబాద్ను వీడమంటున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కార్యాలయాల తరలింపుపై కమిటీకి తేల్చి చెబుతున్న వైనం
మార్చి వరకు ఇక్కడే ఉంటాం..
విద్యా సంవత్సరం మధ్యలో వెళ్తే ఇబ్బంది అంటున్న ఉద్యోగులు
ఈ నెలాఖరుకు అగ్నిమాపక శాఖ తరలింపు
హైదరాబాద్: సాధ్యమైనంత త్వరలో ముఖ్యమైన ప్రభుత్వ విభాగాలను విజయవాడకు తరలించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకు హైదరాబాద్ను వీడబోమని ఉద్యోగులు తేల్చి చెబుతున్నట్లు తెలిసింది. విద్యా సంవత్సరం మధ్యలో హడావుడిగా హైదరాబాద్ను వదిలి విజయవాడ వెళ్లాలంటే కుటుంబపరంగా ఇబ్బందులుంటాయని స్పష్టం చేస్తున్నారు. రాజధాని కార్యాలయాల తరలింపుపై ముఖ్య కార్యదర్శులతో ఏర్పాటైన కమిటీ చేపట్టిన అభిప్రాయసేకరణలో వారు ఈమేరకు స్పష్టంగా చెబుతున్నారు. బహిరంగ సభల్లో సీఎం ప్రకటించినంత తేలికగా తరలింపు ఉండదని, కార్యాలయాల ఏర్పాటుకు ఓ రూపు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ విభాగాలు పనిచేయడం కష్టమని కమిటీకి ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. కనీసం ఆరు నెలలు గడువిస్తే ఫైళ్ళ సర్దుబాటు, కంప్యూటరీకరణ తదితర అంశాలన్నీ పూర్తి చేస్తామని, ఈలోగా విద్యా సంవత్సరం ముగుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులతో ఏర్పాైటైన కమిటీకి విధివిధానాల రూపకల్పనలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యాంబాబ్, ఆదిత్యనాథ్ దాస్, అజయ్ కల్లాం, సాంబశివరావు, జవహర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీలం సహానీలతో కూడిన ఈ కమిటీ ఈనెల 13వ తేదీకల్లా విధివిధానాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈనెల 6వ తేదీకల్లా వాటిని రూపొందించాలని నిర్ణయించింది. తొలి దశలో ఆరు శాఖలను తరలించేలా ప్రణాళిక తయారు చేయాలని నిర్ణయించింది. హోం, విద్య, వైద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖల విభాగాధిపతులు తొలి దశలో విజయవాడ నుంచి పనిచేసేలా నిర్ణయం తీసుకుంది. వీటిలోనూ హోం, విద్య, ఇరిగేషన్ శాఖల కార్యాలయాలను వీలైనంత త్వరగా తరలించాలని భావిస్తోంది. ఒక్క హోం శాఖకు అవసరమైన స్థలం, భవనాల నిర్మాణాలపై మాత్రమే ఇప్పటివరకు స్పష్టత వచ్చింది. మిగిలిన శాఖలకు ఎంత స్థలం అవసరమన్న విషయం తేలలేదు. హోం శాఖకు కోటి చదరపు అడుగులు అవసరమని కమిటీకి నివేదిక అందింది. ఈ శాఖ కార్యాలయాల ఏర్పాటుకు గన్నవరంలోని మేధా టవర్స్, విజయవాడ బందరు రోడ్డులోని లైలా కాంప్లెక్స్లు అనువుగా లేవు. దీంతో ఈ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.
ఒక్క అగ్నిమాపక శాఖ మాత్రం ఈ నెలాఖరులో విజయవాడ నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజనకు ముందే అగ్నిమాపక శాఖ విజయవాడ నగరంలో ఓ భవన నిర్మాణాన్ని ప్రారంభించింది. మిగతా శాఖల తరలింపులో అనేక అభ్యంతరాలు వస్తున్నాయి.
ఇప్పుడే విజయవాడా.. సారీ
Published Tue, Oct 7 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement