సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలతో సోమవారం రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలు దద్దరిల్లాయి. తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం విద్యుత్సౌధకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్రావులను పోలీసులు గేట్ బయటే అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా జెతైలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా జై సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో విద్యుత్ సౌధ మార్మోగింది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ బైఠాయించడంతో అట్టుడికిపోయింది. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
సీమాంధ్రులకు పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తూ తెలంగాణవాదులను అణచివేయాలని చూస్తున్నారని హరీశ్రావు పోలీసులపై మండిపడ్డారు. విద్యుత్సౌధలో సీమాంధ్ర ఉద్యోగుల దాడిలో గాయపడ్డ సంతోష్కుమార్ అనే ఉద్యోగిని పరామర్శించడానికి వస్తే లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన దుయ్యబట్టారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడిచేసిన వారిపై కేసులు పెట్టలేదు కానీ, ఉద్యోగులకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తారా? అని హరీష్రావు పోలీసులను నిలదీశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు సోమవారం ఏపీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు సత్యనారాయణ రావడం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ ఉద్యోగులపై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. పోలీ సులు శాంతింపజేసేందుకు యత్నించినా వారు వినలేదు. దీంతో సత్యనారాయణను బయటకు తీసుకువెళ్లడంతో తెలంగాణ ఉద్యోగులు శాంతించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి కృపావరం అధ్యక్షతన సీమాంధ్ర ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన, వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీఎన్జీవోస్ ఇచ్చిన పిలుపు మేరకు గన్ఫౌండ్రీలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్లో సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అబిడ్స్ తిలక్రోడ్డులోని బీమాభవన్లో సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కొనసాగింది.
రాజధానిలో మళ్లీ పోటాపోటీ ఆందోళనలు
Published Tue, Aug 27 2013 1:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement