పీసీపల్లి, న్యూస్లైన్ :
పీసీపల్లి మండలంలో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల్లో 33 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. అధికార పార్టీ చోటా నాయకులు, ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బందికి ఈ అవినీతి భాగోతంలో భాగస్వామ్యం ఉందని విమర్శలొస్తున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు ఉపాధి నిధులు
ఈ ఏడాది నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ఉపాధి హామీ నిధులను నొక్కేసేందుకు వేదికగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలతో పీసీపల్లి మండలంలోని మేజర్పంచాయతీల్లో హడావుడిగా పనులు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ చోటా నాయకులు.. తమ పలుకుబడిని ఉపయోగించి బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. పీసీపల్లి మండలంలో 2012-13లో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు 1.87 కోట్ల నిధులు ఖర్చు చేశారు. ఇందులో మెటీరియల్కు 14.47 లక్షలు, కూలీలకు 1.72 కోట్లు చెల్లించారని, మొత్తం 1,200 పనులు చేపట్టినట్లు సామాజిక తనిఖీ బృందం సభ్యులు మంగళవారం నిర్వహించిన ప్రజావేదికలో వెల్లడించారు. ఈ పనుల్లో మొత్తం 33 లక్షల రూపాయల అవినీతి చోటుచేసుకుందని ఉపాధి హామీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు.
అవినీతికి పాల్పడింది
ఈ గ్రామాల్లోనే..
గుదేవారిపాలెంలో 4 లక్షల పనులు చేయగా 1.85 లక్ష లు, బట్టుపల్లిలో 2 లక్షల పనులు చేయగా 5 వేలు, వేపగుంపల్లిలో 38 వేల పనులు చేయగా 2 వేలు, వెంగళాయపల్లిలో 14.80 లక్షలకు గాను 4.50 లక్షలు, పీసీపల్లిలో 30 లక్షల పనులకుగాను 1.80 లక్షలు, గుంటుపల్లిలో 15 లక్షల పనులకుగాను 5.80, మారెళ్లలో 4 లక్షల పనులకుగాను 16 వేలు, మురుగమ్మిలో 25 లక్షల పనులకుగాను 13 లక్షలు, లక్ష్మక్కపల్లిలో 12 లక్షల పనులకుగాను 2 లక్షలు, తలకొండపాడులో 3 లక్షల పనులకుగాను 15 వేలు, పెదఇర్లపాడులో 8 లక్షల పనులకుగాను 70 వేలు, పెదఅలవలపాడులో 11 లక్షల పనులకుగాను 97 వేలు, చౌటగోగులపల్లిలో 3 లక్షల పనులకుగాను 10 వేలు, చింతగుంపల్లిలో 14 లక్షల పనులకుగాను 10 వేలు, చినవరిమడుగులో 6 లక్షల పనులకుగాను 3.50 లక్షలు, ముద్దపాడులో వేయి, నేరేడుపల్లిలో 9 లక్షల పనులకుగాను 2 వేలు నొక్కేసినట్లు తనిఖీలో తేలిందని స్టేట్ ఎస్ఆర్పీ శ్రీనివాసరావు తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
‘ఉపాధి’ పనుల్లో 33 లక్షల అవినీతి
Published Thu, Dec 26 2013 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement