నేటితో ముగియనున్న గడువు
పలుకుబడి లేని వారికి ఏజెన్సీలో పోస్టింగ్
మహారాణిపేట(విశాఖ):బదిలీల గడువు నేటితో ముగియనుండడంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్,జెడ్పీల్లోసూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ పరిధిలో 300 మంది కార్యదర్శులను మండలం దాటి బదిలీలు చేయనున్నారు. ఇప్పటికీ వీరి జాబితాను సిద్ధం చేసి కలెక్టర్ ఆమోదం కోసం డీపీఓ టి.వెంకటేశ్వర్రావు పంపించారు. వీరితోపాటు కార్యాలయంలో పనిచేస్తున్నసీనియర్ అసిస్టెంట్లు,జూనియర్ అసిస్టెంట్ల బదిలీకి రంగం సిద్ధమైంది. కలెక్టర్ ఆమోదం వచ్చిన వెంటనే వీరికి స్థానాల కేటాయింపు జరుగుతుంది. శనివారం సాయంత్రానికల్లా వీరికి కొత్తస్థానాలు కేటాయించే అవకాశం ఉంది. జిల్లాపంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీఎల్పీఓలను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది.
విశాఖ డివిజన్ డీఎల్పీఓ మోహన్రావును విజయనగరం, పాడేరు డీఎల్పీఓ రామ్ప్రసాద్, నర్సీపట్నం డీఎల్పీఓ పి.సత్యనారాయణను ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం బదిలీ చేసింది. వీరిస్థానంలో శ్రీకాకుళం నుంచి బి.మోహనరావు, బి.ఎం.ఎలీవియా, పి.శిరీషారాణి ఇక్కడకు వస్తున్నారు. వీరికి కలెక్టర్ ఆమోదంతో డివిజన్లు కేటాయిస్తారు. డీపీఓ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఆర్.నారాయణరావును శ్రీకాకుళంబదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి ఎస్.ఎస్.ఎస్.ఎస్.ఎన్.మూర్తి వస్తున్నారు.
ఎంపీడీఓ పోస్టులకు గిరాకీ: ఇదిలా ఉండగా జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాల్లో ఎంపీడీఓల పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారి స్థానాలను ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి, కోటవురట్ల, నర్సీపట్నం, పరవాడ, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, నక్కపల్లి మండలాలకు పోటీ ఎక్కువగా ఉండడంతో అవే కావాలని ఎంపీడీఓ అభ్యర్థులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
మైదాన ప్రాంతంతో పాటు రోడ్డుపక్కన మండలాల్లో ఎంపీడీఓ పోస్టులకు రేటు ఎక్కువగానే పలుకుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, ఎలాంటి పలుకుబడి లేనివారిని, డబ్బులు ఇచ్చుకోలేని వారిని ఏజెన్సీ ప్రాంతానికి పంపించేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తరువాత ఈ ఎంపీడీఓ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. జెడ్పీ పరిధిలో 200మంది వరకు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ జయప్రకాశ్నారాయణ్, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ కౌన్సెలింగ్ నిర్వహించారు.
బదిలీల జాతర
Published Fri, Aug 14 2015 11:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement