- అధ్యాపకులు, వారి సర్టిఫికెట్లూ బోగస్సే
- ఎంటెక్లో 550 సీట్లు, ఎంఫార్మసీలో 250 సీట్ల కోత
యూనివర్సిటీ : ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో 10 వేలమంది విద్యార్థులు ఎంటెక్ను అభ్యసిస్తున్నారు. జేఎన్టీయూ అధికారులు ప్రతి ఏటా నిజనిర్ధారణ కమిటీ కళాశాల మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ల్యాబొరేటరీ, గ్రంథాలయం వంటి అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది. తనిఖీల సమయంలో మాత్రం మొబైల్ ప్యాకింగ్ చేస్తున్న కళాశాలలు, తరువాత గాలికి వదిలేస్తున్నాయి. ఏఐసీటీఈ తనిఖీల్లో ఈ లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
దాగుడు మూతలు : ఒక కళాశాలలో ఉన్న వారినే మరో కళాశాల అధ్యాపకులుగా చూపించడం, అర్హతలు లేకున్నా బోధన సిబ్బందిని నియమించడం, కొంత మంది అర్హతలతో రికార్డులు సృష్టించుకొన్నా వారి సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారణ అవుతున్నాయి. చాలా కళాశాలల్లో అర్హత పత్రాలు చూస్తే అటువంటి వర్సిటీలు దేశ, విదేశాల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీటెక్లలో సీట్లు అరకొరగా భర్తీ అవుతున్నా, ఎంటెక్లో మాత్రం సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అవుతున్నాయి. ఒక్క జేఎన్టీయూ అనంతపురం పరిధిలో 4 వేల మంది విద్యార్థులు కళాశాలల్లో అడుగు పెట్టకుండానే ఎంటెక్ పట్టా అందుకొంటున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జేఎన్టీయూ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే బయోమెట్రిక్ను ట్యాంపర్ చేసి పరీక్షలకు హాజరు శాతాన్ని చూపిస్తున్నారు. పంపిన డేటా నకిలీదా? సరైనదా? అని తేల్చడానికి వర్సిటీ వద్ద సరైన యంత్రాంగం లేకపోవడంతో ఇవి అలంకారప్రాయంగానే కళాశాలలో ఉండిపోయాయి.
ఎం ఫార్మసీ అడ్మిషన్ పొందితే... : గతేడాది ఎంఫార్మసీ సీట్లు నింపుకోవడానికి విద్యార్థులకు ఉచితంగా ైబె క్, ల్యాప్టాప్ కంప్యూటర్లు ఇచ్చారు. ఒక్కో విద్యార్థికి రూ.2లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వస్తుంది. దీంతో విద్యార్థి తరగతులకు హాజరైనట్లు చూపుతున్నా రు. ఎంటెక్ కోర్సు రెండేళ్లకు రూ.1,14,000 వస్తుండడంతో తాయిలాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పీజీఈ సెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 3వరకు అనంతపురంతోపాటు మరో మూడు హెల్ప్లైన్ సెంటర్లలో విద్యార్థుల సర్టిఫికెట్స్ పరిశీలన నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు, వసతులను దృష్టిలో ఉంచుకుని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (ఏ) పరిధిలో 550 ఎంటెక్ సీట్లు, 250 ఎం.ఫార్మసీ సీట్లు కోత విధించారు.
ఎంటెక్.. ఉత్త టెక్కే!
Published Wed, Aug 26 2015 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement