హతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన
కొనసాగుతూ ఉన్న దర్యాప్తు
{పజల్లో పెరుగుతున్న భయాందోళనలు
ఎస్.కోట: నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండగా పోలీసులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. దారుణ హత్యలకు తెగబడుతున్నవారి తెలివితేటల ముందు పోలీసులు తెల్లముఖం వేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం లక్కవరపుకోటలో జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించకముందే ఎస్.కోటలో ఈ నెల 11న జరిగిన రైల్వే ఉద్యోగి స్వాతి హత్య కలకలం సృష్టించింది. మరోవైపు.. అనుమానాస్పద స్థితిలో మరణించిన గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఆమె మరణించి ఐదారు రోజులై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు ఎవరో.. ఎలా మరణించిందనే అంశాలు ఇంకా తేలలేదు. ఇప్పటికీ మిస్టరీ వీడని హత్య కేసుల వివరాలిలా ఉన్నాయి.
ఈ నెల 11వ తేదీ రాత్రి ఎస్.కోట పట్టణ శివారులో రైల్వేస్టేషన్ పి.డబ్ల్యూ.డి. కార్యాలయం వెనుక ఉన్న 132/25 కె.వి.ట్రాక్షన్ సబ్స్టేషన్లో టెక్నీషియన్ చిట్టిమోజు స్వాతి (29), హెల్పర్ పార్వతి విధి నిర్వహణలో ఉండగా రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. పార్వతి ముఖంపై ఒకరు గోనె కప్పి బయటికి ఈడ్చుకురాగా మిగిలిన ఇద్దరు స్వాతిపై బలైమైన ఆయుధంతో దాడి చేశారు. ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం చేసి చంపేశారు. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్టు సమాచారం లేదు.
లక్కవరపుకోటకు చెందిన జామి సత్యనారాయణపై మార్చి 21న సమీప రైల్వే ట్రాక్ వద్ద దుండగులు దాడిచేశారు. సత్యనారాయణ స్పృహ కోల్పోవటంతో చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. మరుసటి రోజు సత్యనారాయణను గుర్తించిన స్థానికులు, పోలీసులు విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వారంపాటు మృత్యువుతో పోరాడిన సత్యనారాయణ 28న మరణించారు.
ముందుకెళ్లని దర్యాప్తు
ఈ రెండు హత్య కేసుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ల సేవలను వినియోగించుకున్నారు, పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు కలవరం చెందుతన్నారు. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
హత్య కేసుల్లో వీడని మిస్టరీ!
Published Tue, May 26 2015 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement