రెప్పపాటు సమయంలో ఓ పెద్ద ప్రమా దం తప్పింది. చూస్తుండగానే లారీ అదుపుతప్పి దూసుకుపోయి రెండు ఆటోలను , ఒక బైక్ను, ఒక టేలాను ఢీకొట్టి డ్రెరుునేజీలో ఇరుక్కుంది. ఈ సంఘటన క్షణాలపాటు భయానికి గురిచేసింది. ప్రత్యేక్ష సాక్షులు ఎండీ షరీఫ్, కిష్ట య్య కథనం ప్రకారం.. మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు అప్పుడే దుకాణాలు తీసేందుకు వ్యాపారులు వస్తున్నా రు. హోటళ్లలో టిఫిన్, టీ కోసం జనం వస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎరువుల లోడ్తో వస్తున్న సీజీ04 ఈ 8929 నంబర్ గల లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ఆగిపోవడంతో స్టీరింగ్ లాక్ అయింది.
తిరిగి స్టార్ట్ చేసి గేర్వేయడంతో అదుపు తప్పి లారీ వేగంగా ప్రధాన రహదారి పక్కకు దూసుకుపోయింది. దీంతో ఎదురుగా ఉన్న కుంద శ్రీనివాస్కు చెందిన ఏపీ01వై1846 నంబర్ గల ఆటో, షాబొద్దీన్కు చెందిన ఏపీ01వై6213 నంబర్ గల ఆటో, కిష్టాపూర్కు చెందిన మేకల చిన్నయ్యకు చెందిన ఏపీ01ఎస్2972 నంబర్ గల టీ వీఎస్ చాంప్కు ఢీకొట్టిం ది. అంతటితో ఆగకుండా కాసారపు మల్లవ్వకు చెందిన టేలాను ఢీకొట్టి డ్రె రుునేజీలో రెండు టైర్లు దిగబడటంతో హేర్కటింగ్ సెలూన్కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామం తో పక్కనే ఉన్న హోటల్ యజమాని షరీఫ్, హేర్సెలూన్కు కటింగ్ కోసం వచ్చిన వారు, హోటల్కు వచ్చిన వారు పరుగులు తీశారు. అయితే కనురెప్ప పాటున లారీ దూసుకురావడం, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అర నిమిషంలోనే...
లారీ దూసుకువస్తున్న అర నిమిషంలోనే కాసారపు మల్లవ్వ టేలా దిగి పక్కు వెళ్లింది. అప్పుడే లారీ టేలను ఢీకొట్టి ధ్వంసం చేసింది. మల్లవ్వ దిగి ఉండకపోతే మరణించి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా తిరుపతి అనే వ్యక్తి హేర్ సెలూన్ లోనికి పరుగులు తీయడం, హోటల్లో ఉన్న వారు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఆ సమయంలో హోటల్ యజమాని షరీఫ్ పొయ్యిలో మంట వెలుగిస్తూ అక్కడే ఉన్నాడు. లారీ కేవలం ఆయనకు ఫీట్ దూరంలోనే ఆగింది. డ్రెరుునేజీ లేకుంటే కనీసం పది ప్రాణాలు గాలిలో కలిసేవని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ అక్కడి వారు తేరుకునేలోపే పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
గడియలో తప్పిన గండం
Published Mon, Aug 5 2013 4:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement