అనంతపురం అగ్రికల్చర్ : అనంతపురం జిల్లా అభ్యున్నతికి అనంత వెంకటరెడ్డి ఎనలేని కృషి చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో అనంత వెంకటరెడ్డి 15వ వర్థంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా విశేష సేవలు అందించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్రెడ్డి, పార్టీ నేతలు చవ్వా రాజశేఖర్రెడ్డి, తోపుదుర్తి భాస్కర్రెడ్డి, హెచ్.నదీంఅహ్మద్, సిద్ధారెడ్డి, మీసాల రంగన్న, బోయ తిప్పేస్వామి, నార్పల సత్యనారాయణరెడ్డి తదితరులు కొనియూడారు. మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని వైఎస్సార్ సీపీ ఉరవకొండ, కదిరి ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్బాషా పేర్కొన్నారు.
రాజకీయాల్లో విలువలు పాటించి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. నిజాయితీ, చిత్తశుద్ధి తన తండ్రి స్వంతమని అనంతవెంకటరెడ్డి తనయుడు, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన చూపించిన బాటను తూచ తప్పకుండా పాటిస్తూ అన్ని వర్గాల సంక్షేమం కోసం జిల్లా అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా జలాలు జిల్లాకు తీసుకురావాలని ఆనాడే అనంత వెంకటరెడ్డి ఎంతో తాపత్రపడ్డారని మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు.
ఫ్యాక్షనిజానికి దూరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ నేటితరం రాజకీయ నేతలకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అనంత వెంకటరెడ్డి అరుదైన రాజకీయ నేత అని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ అన్నారు. సామాన్య జీవితం గడుపుతూ జిల్లా అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి పోరాడిన వ్యక్తిని కొనియూడారు.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నేతలు సోమర జయచంద్రనాయుడు, కేటీ శ్రీధర్, దాదాగాంధీ, శంకర్, డాక్టర్ గోవర్దన్రెడ్డి, జాన్వెస్లీ తదితరులు వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నేత ఎం.వి.రమణ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, నగర కమిటీ నేతలు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, రంగంపేట గోపాల్రెడ్డి, చింతకుంట మధు, మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మిద్దిభాస్కర్రెడ్డి, బండి పరశురాం, నరేంద్రరెడ్డి, బోయసుశీలమ్మ, శ్రీదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
అనంతకు ఘన నివాళి
Published Tue, Jan 6 2015 3:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement