ప్రభుత్వ మద్దతుధర మాటలకే పరిమితమైంది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల జాడేలేకపోయింది. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక రైతన్నలు తమ ధాన్యాన్ని కర్ణాటకలోని రాయిచూరు మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. ఫలితంగా వేల క్వింటాళ్ల ధాన్యం సరిహద్దు దాటుతోంది. ఇప్పటివరకు 60వేల బస్తాల ధాన్యం పొరుగురాష్ట్రానికి తరలినట్లు తెలుస్తోంది. మార్కెట్ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా సంబంధిత అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు.
మక్తల్ రూరల్, న్యూస్లైన్: మక్తల్ వ్యవసాయ మార్కెట్యార్డు ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లతో కళకళలాడుతూ ఉండేది. క్రయవిక్రయాల్లో జిల్లాలోనే రెండోస్థానం దక్కిం ది. కాగా, ప్రస్తుతం ఇక్కడి మార్కెట్కు ధాన్యం కావడమే కరువైంది. గత కొన్నేళ్లుగా మార్కెట్యార్డులో వ్యాపారులు కమీషన్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్య వహరించడం, గిట్టుబాటు ధరలు కల్పించకపోడం వల్ల రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి మార్కెట్కు ఖరీ దుదారులు రాకపోవడం, స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. బాగా ఆరిన(తేమలేని) హంస రకం వరి ధాన్యానికి మక్తల్ మార్కెట్లో వెయ్యి లోపే చెల్లిస్తున్నారు. అదే రాయిచూర్ మార్కెట్లో రూ.1300 చెల్లిస్తున్నారు. సోనా రకానికి రూ.1600 పలుకుతుంది. అలాగే కొందరు వ్యాపారులు కూడా రైతుల వద్ద నేరుగా కల్లాల్లోనే వరి ధాన్యాన్ని కొనుగోలుచేసి కర్ణాటక తరలిస్తున్నారు.
దీనికితోడు వ్యాపారులు స్థానిక మార్కెట్లో క్వింటాలుకు రూ.మూడు నుంచి రూ.ఐదు చొప్పున కమీషన్ తీసుకుంటే రాయిచూర్ మార్కెట్లో మాత్రం రూ.రెండు నుంచి రూ.మూడు మాత్రమే తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. కంది క్వింటాలుకు మన మార్కెట్లో రూ.3900 - 4500 చెల్లిస్తుండగా, కర్ణాటకలో రూ. 4500- 5000 ఇస్తున్నారు. పత్తి కూడా జిల్లాలో రూ. 4500 పలుకుతుండగా రాయిచూరు మార్కెట్లో మాత్రం రూ. ఐదువేలు చెల్లిస్తున్నారు. దీంతో చాలామంది రైతులు తమ ధాన్యాన్ని అక్కడికి తీసుకెళ్లడమే మేలని భావిస్తున్నారు. దీంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల్లో వాహనాలను తరలిస్తున్నారు.
జాడేలేని కొనుగోలు కేంద్రం
ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చినప్పుటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గతేడాది ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం సీజన్లో ఇంకా ప్రారంభించలే దు. అధికారులు ఇప్పుడు చేస్తాం, అప్పు డు చేస్తాం అంటూ కాలయాపన చేస్తుం డటంతో రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ప్రకటించినప్పటికీ స్థానిక వ్యాపారులు అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మార్కెట్ ఆదాయానికి గండి
ఈ సీజన్లో మాగనూరు, మక్తల్, నర్వ, ఊట్కూర్ తదితర ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 50వేల బస్తాల వరిధాన్యం కర్ణాటకకు తరలినట్లు తెలుస్తోంది. ఫలితంగా మక్తల్ వ్యవసాయ మార్కెట్కు సుమారు రూ.30లక్షల వరకు నష్టం వాటిల్లినట్లయింది. అవేవిధంగా కంది వెయ్యి బస్తాల వరకు తరలిపోయింది. తద్వారా మార్కెట్శాఖ రూ.10 లక్షల కోల్పోయింది. ఇప్పటివరకు పత్తి కూడా మూడువేల క్వింటాళ్లకు పైగా తరలిపోగా, రూ.15లక్షల ఆదాయాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో మక్తల్ మార్కెట్కు ధాన్యం రావడమే కరువైంది. మాగనూర్ మండలం కృష్ణానది దగ్గర ఉన్న వాసునగర్ దగ్గర అంతర్రాష్ట్ర రహదారిపై చెక్పోస్టును ఏర్పాటుచేసినా ధాన్యం తరలింపును ఆపలేకపోతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మక్తల్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచే సి గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మార్కెట్ కార్యదర్శి ఏమన్నారంటే..
కర్ణాటక మార్కెట్లో ధాన్యానికి అధికధర ఉండటం వల్ల రైతులు అక్కడికి తీసుకెళ్తున్నారని మక్తల్ వ్యవసామయ మార్కెట్ కార్యదర్శి నూర్జహన్ తెలిపారు. ఇక్కడి నుంచి రాయిచూరు మార్కెట్కు ధాన్యం తీసుకెళ్తున్న వ్యాపారుల నుంచి ఒకశాతం ఫీజు వసూలు చేస్తామన్నారు. ఒకవేళ వ్యాపారులు ఎవరైనా మోసానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధాన్యం సరిహద్దు దాటుతోంది
Published Sat, Dec 21 2013 3:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement