శ్రీకాళహస్తి, న్యూస్లైన్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖినది పుష్కరం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖినదికి ప్రతిఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూలస్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శుక్రవారం శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. స్వామి, అమ్మవారు, వినాయకస్వామి, సుబ్రమణ్యంస్వామి, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖినదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా తవ్వించిన గుంత వద్ద వేదపండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం చక్రాలకు, త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘస్నానం నది పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు.
ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్బోర్డు మాజీ చైర్మన్ శాంతారామ్జేపవార్, ఇన్చార్జి ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ రామిరెడ్డి, పర్యవేక్షకుడు శ్రీనివాసులురెడ్డి, ఆలయాధికారులు హరిబాబుయాదవ్, సుదర్శన్నాయుడు, వెంకటేశ్వరరాజు, మణి, సాయి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
వెండి వాహనాలపై ఊరేగింపు
స్వర్ణముఖినదిలో పంచమూర్తులకు సద్యోముక్తి వ్రతాన్ని నిర్వహించిన తర్వాత పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. స్వామివారు నందివాహనం, అమ్మవారు సింహవాహనం, సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం, వినాయకుడు మూషిక వాహనంపై ఊరేగారు.
మురుగునీటితో తప్పని అవస్థలు
నదిలో పుష్కర పూజల కోసం ప్రత్యేకంగా తవ్వించిన గుంత సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో భక్తులకు అవస్థలు తప్పలేదు. అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూజలు జరుగుతున్న చోటే నదిలో కొందరు బట్టలు ఉతుకుతుండడం కనిపించింది.
వైభవంగా స్వర్ణముఖి పుష్కరం
Published Sat, Feb 15 2014 3:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement