చిలకలూరిపేటరూరల్ : రాములోరి భూములపై అక్రమార్కుల కన్ను పడింది. స్వామివారి ధూప దీప నైవేద్యాల నిమిత్తం అందించిన భూమిని విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని నేపథ్యంలో జిల్లాలో భూములకు పెరిగిన డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దీనిపై అక్రమార్కులు కన్నేసినట్టు సమాచారం. దీనిలో భాగంగానే రాములోరి భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఈ వ్యవహారం అంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటి నుంచో ఈ భూమి సాగులో ఉన్నా 25 ఏళ్ల నుంచి దేవాదాయ శాఖకు కౌలు సొమ్ము జమ కావడం లేదని సమాచారం. వివరాల్లోకి వెళితే...
చిలకలూరిపేటలోని బంగారపు కొట్ల బజారు వద్ద ఉన్న కోదండ రామాలయానికి పసుమర్రులో 1.62 ఎకరాల భూమి (సర్వే నంబర్ 762) ఉంది. ఈ భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నట్లు సబ్ రిజిస్టార్ కార్యాలయ రికార్డులు తెలుపుతున్నాయి. వీటికి భిన్నంగా రెవెన్యూ రికార్డులు, అడంగల్లో మరో పేరు ఉన్నట్టు తెలిసింది.
స్వామివారి కల్యాణం...ఊరేగింపు..
పూర్వపు రోజుల్లో ఈ పంట భూమిలోనే శ్రీరామనవమి, స్వామివారి కల్యాణం నిర్వహించేవారు. దీని కోసం ఇక్కడ రాతితో కల్యాణ మండపం నిర్మించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించేందుకు ఈ పొలంలో నేలబావి తవ్వించారు. దశాబ్దాల కిందట మూడు రోజుల పాటు స్వామివారి కల్యాణాన్ని నిర్వహించిన అనంతరం రాత్రి వేళ కాగడాలతో ఉత్సవ విగ్రహాలను ఊరేగించేవారని పలువురు పెద్దలు, రామభక్తులు తెలిపారు.
ఈ భూమిని 25 ఏళ్ల కిందటి వరకు ట్రస్టీల వారసులు సాగు చేసుకున్నారు. అనంతరం కౌలుకు ఇవ్వసాగారు. అయితే కౌలుదారుడు కౌలు సొమ్ము చెల్లించకపోవడమే కాకుండా, పక్కకు వైదొలగమన్నా తప్పుకోకపోవడం వివాదంగా మారింది. తాను పక్కకు తప్పుకోలంటే భూమి అమ్మితే తనకూ కొంత మొత్తం ఇవ్వాలని షరతు పెడుతున్నట్టు తెలిసింది.
స్పందించని దేవాదాయ శాఖ ...
దేవాదాయ శాఖకు చెందిన భూములను ప్రతి మూడేళ్లకు ఒకసారి బహిరంగ వేలం నిర్వహించి ముందుకు వచ్చిన రైతులకు కౌలుకు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏకంగా 25 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి భూమి సాగు చేస్తున్నా మిన్నకుండిపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
ఎకరా కౌలు రూ.12వేల చొప్పున స్వామివారి భూమి 1.62 ఎకరాలకు ఏడాదికి సుమారు రూ.19,440 రావాలి. ఇలా 25 ఏళ్లకు దాదాపు రూ. 4.86 లక్షల ఆదాయం రావాలి. వాటిని వసూలు చేసి ఆలయ అభివృద్ధికి వినియోగించాల్సిన అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని భక్తజనం ఆరోపిస్తోంది.
ఇక ఆలయ భూములను రికార్డుల పరంగా చూస్తే ఆర్.ఎస్.ఆర్ ఫీల్డ్మ్యాప్లో ధర్మతోపు అని నమోదు చేశారు. ఇందుకు భిన్నంగా అడంగల్లో సర్వే నంబర్ 762లో 1.22 ఎకరాలు ఒకరి పేరు, 40 సెంట్ల భూమి మరొకరి పేరుతో ఉంది. దీని ఆధారంగా కొందరు వ్యక్తులు ఈ భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు మంతనాలు సాగిస్తున్నట్టు భక్తజనం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరో వైపు కోదండ రామస్వామి భూమిని గోవుల మేతకు కేటాయించాలని రామభక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
అది రాములోరి భూమే..
సంబంధిత సర్వే నంబరులోని భూమి దేవాదాయ శాఖకు చెందిన రామాలయ భూమే.ఇప్పటివరకు కౌలు చెల్లించకపోవడంపై నోటీసులు జారీ చేస్తాం. అంతేగాక ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ఉన్నతాధికారులకు నివేదించి స్వామి వారి భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తా.
- నాగిశెట్టి శ్రీనివాసరావు,
ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి
రాములోరి భూములపై కన్ను..
Published Wed, Dec 24 2014 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement