గుర్రపుడెక్కను తొలగించడం లేదు | Sakshi
Sakshi News home page

గుర్రపుడెక్కను తొలగించడం లేదు

Published Thu, Apr 26 2018 7:26 AM

Farmer Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా: ఉంగుటూరు లంకపల్లి మధ్య ఉన్న బుడమేరు మురుగు కాల్వలో గుర్రపుడెక్క పెరిగిపోయింది. వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపునకు గురై రాకపోకలు నిలిచిపోతున్నాయి’ అని ఉంగుటూరుకు చెందిన పలువురు రైతులు బుధవారం ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతను జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సుమారుగా కిలోమీటరు దూరం గుర్రపుడెక్కతో కాలువ నిండిపోయిందని, వర్షాకాలంలో నీటిపారుదల లేకపోవడం వల్ల పొలాలు ముంపునకు గురవుతున్నాయని జగన్‌కు వివరించారు. కాలువ మరమ్మతులు చేసేవిధంగా అధికారులపై ఒత్తిడి తేవాలని రైతులు జననేతను కోరారు.

Advertisement
Advertisement