కుప్పంలో రైతు ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కుప్పంలో రైతు ఆత్మహత్యాయత్నం

Published Fri, Sep 4 2015 8:41 AM

farmer suicide attempt in chittoor distirict

చిత్తూరు: అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పంటసాగు కోసం వేసిన ఐదు బోర్లలో చుక్క నీరు పడకపోవడంతో.. దిక్కుతోచక గురువారం అర్ధరాత్రి ఓ రైతు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం జిటారిమడుగు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటేష్(45) తనకున్న మూడెకరాల భూమిలో ఐదు బోర్లు వేశాడు.

కానీ చుక్క నీరు పడలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటా హుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement