సర్కారుపై ‘రాజధాని గ్రామాల’ రైతుల ఆగ్రహం
స్వతంత్రంగా బతుకుతున్న మమ్మల్ని రోడ్డున పడేస్తారా?
ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. సెంటు భూమి కూడా ఇవ్వం
వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఎదుట స్పష్టంచేసిన రైతులు
సాక్షి, గుంటూరు: రాజధాని కోసమంటూ తమ భూములను అప్పనంగా కాజేసే కుయుక్తులపై కర్షక లోకం కన్నెర్ర చేస్తోంది. కాయకష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకుని భూమిలో బంగారం పండించే భూమిపుత్రులంతా పోరాటానికి సన్నద్ధమయ్యారు. భూసమీకరణ పేరుతో అడ్డగోలుగా భూములను సొంతం చేసుకుకోవాలనుకుంటున్న సర్కారు పెద్దలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సెంటు భూమి ఇచ్చేదిలేదని.. తమ భూములు తీసుకునే రాజధాని నిర్మించాలనుకుంటే తమ శవాలపైనే ఆ రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ‘‘రైతులను మోసం చేశావు... జనాల్ని మోసం చేస్తున్నావు... ఇప్పుడు హైటెక్ మోసంతో మా భూములు తీసుకోవాలని చూస్తున్నావు. మీకు ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగింది. 200 వాగ్దానాలు చేశావు, ఇక్కటైనా నెరవేర్చావా?’’ అంటూ.. రాజధాని కోసం భూ సమీకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతాల రైతులు చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మా పొలాలు తీసుకొని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేద్దామనా?’’ అని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగే పరిస్థితి లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు.ఆదివారం ఆ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పర్యటించి రైతుల మనోగతాన్ని తెలుసుకున్నారు.
ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తే పోరాడతాం: వైఎస్సార్ సీపీ
గుంటూరు జిల్లాలో రాజధాని కడితే ఆనందమే.. కానీ రైతులు నష్టపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ స్పష్టంచేశారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. బడాబాబులు బినామీ భూములను జాగ్రత్త చేసుకుని.. రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అయిదడుగుల్లోనే నీరు పడే ప్రాంతాల్లో రాజధాని నిర్మించాలంటే ఖర్చుతో కూడిన పనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. తమకు పార్టీలతో పనిలేదని, పేద రైతులకు అండగా ఉంటామని చెప్పారు. రైతుల కు నచ్చేవిధంగా ఉండాలి గానీ, ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే పోరాడతామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా రైతులకు హామీ ఇచ్చారు.
మా శవాలపై రాజధాని కట్టుకోండి..
Published Mon, Nov 3 2014 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement