బోనకల్, న్యూస్లైన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుంటే దిక్కుతోచని అన్నదాత లు రోడ్డెక్కారు. సాగు నీరందించాలంటూ వైరా- జగ్గయ్యపేట జాతీయ రహదారిపై గురువారం రాస్తారోకో చేశారు. అయితే అదో పెద్ద నేరంగా భావించిన పోలీసులు.. రైతులను అరెస్ట్ చేసి వారిపై లాఠీలు ఝుళిపించారు. వివరాలిలా ఉన్నాయి.. నాగార్జునసాగర్ కాల్వ పరిధిలోని రాపల్లి మేజర్ కింద వైరా మండ లం అష్టగుర్తి, పాలడుగు, బోనకల్ మండలం సీతానగరం, రాపల్లి, బ్రాహ్మణపల్లి, చిన్నబీరవల్లి గ్రామాలకు చెందిన రైతుల పొలాలు సాగ వుతున్నాయి.
ఖరీఫ్లో వరి, పత్తి సాగు చేయగా, అకాల వర్షాలతో భారీగా నష్టపోయారు. సాగర్ నిండా నీరున్నప్పటికీ రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని అధికారులు చెప్పడంతో మొక్కజొన్న, మిను ము, బొబ్బెర తదితర పంటలు వేశారు. వారబందీ విధానంతో నెలలో రెండు వారాలు నీరు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, 15 రోజులు దాటినా.. సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయి. బీబీసీకి 1300 క్యూసెక్కులకు గాను, 800-900 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండటంతో చివరి భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి.
ఈ విషయాన్ని ఎన్నెస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు స్పందించడం లేదు. దీంతో ఆగ్రహించిన రైతు లు రాస్తారోకోకు దిగారు. అధికారులు వచ్చి తమకు సరైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ తాండ్ర నరేష్ అక్కడికి చేరుకుని, 20 మంది రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
రైతులపై జులుం..
రాస్తారోకో చేస్తున్న రైతులపై ఎస్ఐ నరేష్ జులుం ప్రదర్శించారు. కాల్వ వద్దకు వెళ్దామంటూ వారిని ఆటో ఎక్కించి నేరుగా పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ రైతులను వరుసక్రమంలో నిల్చోబెట్టి లాఠీకి పనిచెప్పారు. దీంతో రైతులు నివ్వెర పొయారు. సాగునీటి కోసం వస్తే తమకీ శిక్ష ఏంటని నిశ్చేష్టులయ్యారు. జానకీపురం గ్రామ సర్పంచ్ భర్త మాలెంపాటి రామకృష్ణను ముందుగా పిలిచి చితకబాదారు.
రైతు సంఘాల ఆగ్రహం..
రైతుల అరెస్ట్ విషయం తెలియగానే పలు రైతు సంఘాలు, పార్టీల నాయకులు పోలీస్స్టేషన్కు చేరుకుని, సాగునీటి కోసం రాస్తారోకో చేసిన వారిపై చేయిచేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎస్ఐ వారి ముందే మరోసారి రైతులపై జులుం ్రపదర్శించారు. దీంతో రైతులు, నాయకులు చేసేదేమీ లేక వెనుదిరిగారు. అనంతరం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పోలీసుల వైఖరిని అఖిల పక్షనాయకులు పైడిపల్లి కి షోర్, తమ్మారపు వెంకటేశ్వర్లు, గాలి దుర్గారావు, బొడేపూడి చందు, చిలక వెంకటేశ్వర్లు, జంగం ఆర్లప్ప, తన్నీరు రవి, చింత లచెర్వు కోటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, చావా హనుమంతరావు, మందడపు తిరుమలరావు తదితరులు తీవ్రంగా ఖండించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
అన్నదాతల ఆందోళన
Published Fri, Feb 7 2014 3:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement