అయ్యా.. సబ్సిడీ రుణం ఆపేశారు | Sakshi
Sakshi News home page

అయ్యా.. సబ్సిడీ రుణం ఆపేశారు

Published Fri, Apr 27 2018 7:11 AM

Farmers Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా : ‘అయ్యా.. కల్లుగీత ఫెడరేషన్‌ ద్వారా రూ. 2 లక్షల సబ్సిడీ లోనుకు దరఖాస్తు చేశాను. వైఎస్సార్‌ సీపీలో తిరుగుతున్నానని నాకు రుణం రాకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు’ అంటూ కల్లుగీత కార్మికుడు   జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం     నియోజకవర్గంలోని ఇందుపల్లిలో గీత కార్మికుడు       వెంకటేశ్వరరావు జగన్‌ను కలసి సమస్య విన్నవించారు. కల్లుకు డిమాండ్‌ తగ్గటం, వయస్సు మీదపడటంతో స్వయం ఉపాధిపై ఫెడరేషన్‌ ద్వారా రుణానికి దరఖాస్తుౖ చేస్తే మంజూరు కానివ్వలేదన్నారు. 1986 నుంచి తనకు కల్లుగీత కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉందని, అర్హుడైనప్పటికీ రాజకీయ వివక్ష చూపుతున్నారనికన్నీటిపర్యంతమయ్యారు.

Advertisement
Advertisement