రాప్తాడు: టమాటా పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పలువురు రైతులు వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాయలసీమ కన్వీనర్ తరిమెల శరత్చంద్రారెడ్డి, పార్టీ రైతు విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు రాజారాంలతో కలిసి ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. పంటకు గిట్టుబాటు ధరలేక నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తిచేశారు.
నాటా మహాసభలకు జగన్కు ఆహ్వానం
శెట్టూరు: అమెరికాలో 2018 జూలైలో నిర్వహించనున్న నాటా మహాసభలకు హాజరుకావాలని నాటా ప్రతినిధులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. బుధవారం పాపంపేట బైపాస్ వద్ద శిబిరంలో నాటా అధ్యక్షుడు గంగసాని రాజేశ్వర్రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ గోసల రాఘవరెడ్డి, కార్యనిర్వహణ ఉపాధ్యక్షుడు కొరసపాటి శ్రీధర్రెడ్డి, సాంస్కృతిక విభాగం చైర్మన్ ఆళ్ల రామిరెడ్డి, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అన్నపురెడ్డి హర్షవర్ధన్రెడ్డిలు జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.