పోలవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని సోమవారం రైతులు అడ్డుకున్నారు. పోలవరం కుడికాలువ 1.5 కిలోమీటరు వద్ద కాంట్రాక్టరు చేపట్టిన మట్టి తవ్వకం పనుల్ని నిలిపేశారు. పరిహారం చెల్లించకుండా తమ భూముల్లో పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చెప్పిన మేరకు ఎకరానికి రూ.19.53 లక్షల నష్టపరిహారం, రూ.20 వేల పంటనష్టం చెల్లించాకే పనులు చేపట్టాలని తాము అప్పుడే చెప్పామని, దీనికి అధికారులు కూడా అంగీకరించారని తెలిపారు.
ఇప్పుడు పరిహారం చెల్లించకుండానే పనులు ఎందుకు చేపట్టారని నిలదీశారు. తన చేలో మట్టి పోస్తున్న విషయమై వీఆర్వో డి.గణపతిరావును అడగ్గా మట్టి నమూనా సేకరణ కోసమని చెప్పారని, కానీ వాస్తవం అదికాదని రైతు పంతులు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పనుల్ని అడ్డుకున్న విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎం.ముక్కంటి అక్కడకు చేరుకుని వారితో చర్చలు జరిపారు.
రైతుల భూములకు పూర్తిగా పరిహారం చెల్లించేందుకు మండల మేజిస్ట్రేట్గా తాను లేఖ ద్వారా హామీ ఇస్తానని, 60 రోజుల తరువాత పూర్తిగా పరిహారం చెల్లిస్తామని తహశీల్దార్ చెప్పారు. ఆ మేరకు ఆయన ఇవ్వబోయిన లేఖను తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోను నష్టపరిహారం చెల్లించాకే భూముల్లో పనులు చేసుకోవాలని స్పష్టం చేశారు. రైతులు తైలం శ్రీరామచంద్రమూర్తి, కేదాసు మోహన్రావు, ఎదురేసి లక్ష్మి, తోరం సాయి, సిగ్ధన అరవాలరాజు, బండి కృష్ణ, గోపల వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.
పట్టిసీమ పనులను అడ్డుకున్న రైతులు
Published Tue, Apr 21 2015 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement