తల్లిదండ్రులకు పాదాభిషేకం | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు పాదాభిషేకం

Published Sat, Feb 15 2014 2:14 AM

తల్లిదండ్రులకు పాదాభిషేకం - Sakshi

తల్లిదండ్రులకు పాదాభిషేకం
 క్కిరెడ్డిపాలెం, : ప్రేమికుల రోజుకు సరికొత్త అర్థం చెప్పారు ఆ పాఠశాల పిల్లలు. అమ్మానాన్నలను ప్రేమతో పూజించి తమ మమకారాన్ని చాటుకున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం మింది పాఠశాలలో తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా పూలమాలలతో సత్కరించారు. అనంతరం తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి, బొట్లుపెట్టి, పూలతో పాదాభిషేకం నిర్వహించారు. నుదుట కుంకుమ బొట్లు పెట్టి, హారతులిచ్చి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తమ పిల్లలు చేస్తున్న పూజలకు తల్లిదండ్రుల కళ్లు చమర్చాయి. ఈ తరంలో పిల్లలకు తమ పట్ల ఇంతటి ప్రేమను కలిగించిన టీచర్లకు తల్లిదండ్రులు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ప్రేమికుల రోజు యువతి, యువకులకే కాదని, పిల్లలపై తల్లిదండ్రులు చూపేదే అసలైన ప్రేమ అని హెడ్మాస్టర్ ఎల్.ఎస్.ఎన్..పాత్రుడు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవికుమార్, స్వరూపిణి, శ్రీదేవి, శ్రీలక్ష్మి, విజయ్‌కుమార్, నాగలత, దమోదర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement