'ఆస్తి లేదని కొడుకు పీక కోసి తనూ.. | Sakshi
Sakshi News home page

'ఆస్తి లేదని కొడుకు పీక కోసి తనూ..

Published Mon, Jul 6 2015 5:55 PM

father attacks his son and commit suicides for property

అనకాపల్లి (విశాఖపట్టణం): తమకు ఎవరూ లేరని, ఆస్తిపాస్తులు లేవని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కుమారుడి గొంతుకోసి, తనూ పీక కోసుకున్నాడు. ఈ విషాద సంఘటన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన తరగడం నర్సింహారావు పదేళ్ల క్రితం నిజామాబాద్‌కు వలస వెళ్లాడు. ఇన్నేళ్ల తర్వాత తిరిగి సోమవారం అనకాపల్లి చేరుకున్నారు.

కాగా, కొన్నేళ్ల క్రితమే అతని భార్య మృతి చెందింది. ఈ క్రమంలోనే అనకాపల్లి చేరుకున్న అతనికి బంధువులు, ఆస్తిపాస్తులు ఏమిలేవని మనస్తాపం చెందాడు. దీంతో కత్తితో కుమారుడి పీక కోసి, తనూ కోసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వైజాగ్ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement